కింగ్ చార్లెస్ IIIకు అభినందనలు తెలిపిన యూఏఈ అధ్యక్షుడు
- September 18, 2022
అబుధాబి: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ రోజు యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, నార్తర్న్ ఐర్లాండ్ రాజు చార్లెస్ IIIకి ఫోన్ చేసి మాట్లాడారు. దివంగత క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత రాజుగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు తెలిపారు. క్వీన్ ఎలిజబెత్ II అడుగుజాడల్లో నడవాలని, రాజుగా విధులు నిర్వహించడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. చార్లెస్ III హయాంలో యునైటెడ్ కింగ్డమ్, అక్కడి ప్రజలు మరింత అభివృద్ధి సాధించాలని యూఏఈ అధ్యక్షుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్కు కింగ్ చార్లెస్ III ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







