జి-20 సమావేశానికి ఒమన్ను ఆహ్వానించిన భారత్
- September 18, 2022
మస్కట్: G-20 సమ్మిట్, సమావేశాలలో అతిథి దేశంగా ఒమన్ పాల్గొననుంది. ఈ మేరకు ఒమన్కు భారతదేశం ప్రత్యేక ఆహ్వానాన్ని అందించింది. న్యూఢిల్లీలో 2023 సెప్టెంబర్ 9, 10 తేదీలలో G-20 దేశాధినేతల సమ్మిట్ జరుగనుంది. ఇప్పటికే బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, సింగపూర్, స్పెయిన్, యూఏఈ దేశాలను భారత్ ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా సుల్తానేట్లోని భారత రాయబారి హెచ్ఈ అమిత్ నారంగ్ మాట్లాడుతూ.. జి-20 అధ్యక్షుడి హోదాలో ఉన్న భారత్.. అతిథి దేశంగా ఒమన్ను ఆహ్వానించడం రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక స్నేహానికి ప్రతీక అన్నారు. ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ GDPలో దాదాపు 85 శాతం వాటాను G-20 కూటమి కలిగి ఉందన్నారు. ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ప్రీమియర్ ఇంటర్ గవర్నమెంటల్ ఫోరమ్లో పాల్గొనడానికి సుల్తానేట్కు ఇది ఒక మంచి అవకాశం అని నారంగ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









