రెసిడెన్సీ విధానాలను పూర్తి చేయని కార్మికులపై పరారీ కేసులు
- September 19, 2022
కువైట్: వర్క్ పర్మిట్లతో దేశంలోకి వచ్చి రెసిడెన్సీ విధానాలను పూర్తి చేయని ప్రవాస కార్మికులపై పరారీ కేసులను నమోదు చేయడానికి "ఆశల్" పోర్టల్లో కొత్త ఫీచర్ ను ప్రారంభించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (PAM) తెలిపింది. రెసిడెన్సీ విధానాలను పూర్తిచేయని వారిని గుర్తించి వారి సమస్యలను పరిష్కరించడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిని పట్టుకోవడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు పబ్లిక్ అథారిటీ పేర్కొంది. ఇప్పటివరకు నమోదైన దాదాపు 1,000 పరారీ కేసులను తనిఖీ విభాగం అధ్యయనం చేస్తోందని పీఏఎం తెలిపింది. సాధారణంగా తనపై నమోదైన ఫిర్యాదుపై రెండు నెలలలోపు అభ్యంతరం చెప్పే హక్కును కార్మికుడికి చట్టం ఇస్తుంది. రెండు నెలల గడువు ముగిసిన తర్వాత సదరు కార్మికుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఫైల్ రెసిడెన్సీ వ్యవహారాల దర్యాప్తు విభాగానికి బదిలీ అవుతుంది. అక్కడ రెసిడెన్సీ విధానాలు పాటించని కార్మికుడిని దేశం నుంచి బహిష్కరణతో సహా ఇతర చర్యలను అంతర్గత మంత్రిత్వ శాఖ తీసుకునే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం
- విజయ్ కీలక నిర్ణయం..
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!
- కువైట్ విమానాశ్రయం పూర్తిస్థాయిలో సిద్ధం..భద్రతకు ప్రాధాన్యత..!!









