ఒమన్లో వాణిజ్య సముదాయాలపై సీపీఏ రైడ్స్
- September 19, 2022
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లోని అల్ మజ్యోనాలోని విలాయత్లోని అనేక వాణిజ్య సముదాయాలపై దాడులు చేసినట్లు వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) తెలిపింది. ఈ సందర్భంగా వినియోగదారుల రక్షణ చట్టం, నిబంధనలను పాటించని పలు దుకాణాలకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అల్ మజియోనాలోని వినియోగదారుల రక్షణ విభాగం, అల్ మజియోనా మునిసిపాలిటీ సహకారంతో ఈ దాడులు జరిగినట్లు సీపీఏ తెలిపింది. తనిఖీల సందర్భంగా గడువు ముగిసిన వస్తువులు, ప్రజా నైతికతకు విరుద్ధంగా ఉన్న అనేక వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రక్షణ అథారిటీ అధికారులు తెలిపారు. అదే సమయంలో వినియోగదారుల రక్షణ చట్టాలు, నిబంధనలపై దుకాణదారులకు అవగాహన కల్పించినట్లు సీపీఏ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







