ఫుడ్ డెలవరీ బాయ్స్ బైక్ ప్రమాదాలను తగ్గించటంపై ట్రాఫిక్ పోలీసుల ఫోకస్
- September 20, 2022
దోహా: ఫుడ్ డెలవరీని ఆన్ టైమ్ లో డెలవరీ చేయాలన్న ఆతృతతో చాలా మంది డెలవరీ బాయ్స్ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. దీంతో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (జీడీటీ), ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ ప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టింది. రెండు డిపార్ట్ మెంట్ లు కలిసి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వర్క్షాప్ నిర్వహించారు. అనంతరం ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ కల్నల్ జాబర్ మహ్మద్ రషీద్ ఒడైబా ఖతార్ రేడియోలో మాట్లాడారు. ఇటీవల కాలంలో ఫుడ్ డెలవరీ చేసే బాయ్స్ సంఖ్య పెరిగిందన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిదేనని అయితే రోడ్డు ప్రమాదాలు కూడా పెరగటం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ ప్రమాదాలను నివారించేందుకే వర్క్ షాప్ ఏర్పాటు చేసామన్నారు. చాలా మంది లోకేషన్ తెలుసుకునేందుకు మొబైల్ యాప్ చూస్తూ డ్రైవింగ్ చేయటం, ఫోన్లలో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండటం కారణంగా ప్రమాదాలు జరగుతున్నాయన్నారు. 2021 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2022 మొదటి త్రైమాసికంలో మూడు రెట్ల ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని అన్నారు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని...డెలివరీ బాయ్స్ కూడా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









