ఫుడ్ డెలవరీ బాయ్స్ బైక్ ప్రమాదాలను తగ్గించటంపై ట్రాఫిక్ పోలీసుల ఫోకస్
- September 20, 2022
దోహా: ఫుడ్ డెలవరీని ఆన్ టైమ్ లో డెలవరీ చేయాలన్న ఆతృతతో చాలా మంది డెలవరీ బాయ్స్ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. దీంతో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (జీడీటీ), ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ ప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టింది. రెండు డిపార్ట్ మెంట్ లు కలిసి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వర్క్షాప్ నిర్వహించారు. అనంతరం ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ కల్నల్ జాబర్ మహ్మద్ రషీద్ ఒడైబా ఖతార్ రేడియోలో మాట్లాడారు. ఇటీవల కాలంలో ఫుడ్ డెలవరీ చేసే బాయ్స్ సంఖ్య పెరిగిందన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిదేనని అయితే రోడ్డు ప్రమాదాలు కూడా పెరగటం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ ప్రమాదాలను నివారించేందుకే వర్క్ షాప్ ఏర్పాటు చేసామన్నారు. చాలా మంది లోకేషన్ తెలుసుకునేందుకు మొబైల్ యాప్ చూస్తూ డ్రైవింగ్ చేయటం, ఫోన్లలో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండటం కారణంగా ప్రమాదాలు జరగుతున్నాయన్నారు. 2021 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2022 మొదటి త్రైమాసికంలో మూడు రెట్ల ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని అన్నారు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని...డెలివరీ బాయ్స్ కూడా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







