EWA కంట్రోల్ సెంటరును తనిఖీ చేసిన విద్యుత్ మంత్రి
- September 21, 2022
బహ్రెయిన్: ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (EWA) ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ల నియంత్రణ కేంద్రాన్ని విద్యుత్, నీటి వ్యవహారాల శాఖ మంత్రి యాసర్ బిన్ ఇబ్రహీం హుమైదాన్ సందర్శించారు. కేంద్రంలోని పనుల పురోగతిని, సేవల నాణ్యత, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరును మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఇబ్రహీం హుమైదాన్ మాట్లాడుతూ.. నియంత్రణ కేంద్రంలోని పర్యవేక్షణ, ఆపరేషన్ ప్రక్రియలు అధిక స్థాయి సంసిద్ధత, విశ్వసనీయతను పెంచుతాయన్నారు. బహ్రెయిన్లో మౌలిక సదుపాయాలు, ఇంధన స్థిరత్వం రంగంలో లక్ష్యాలను సాధించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇందుకోసం నియంత్రణ యంత్రాంగాల అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. విద్యుత్, నీటి పంపిణీ నెట్వర్క్ ప్రాథమిక పనితీరు సూచికలను మెరుగును కొనసాగిస్తామని మంత్రి ఇబ్రహీం హుమైదాన్ తెలిపారు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









