విజిట్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్
- September 22, 2022
దోహా: FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 సందర్భంగా 2022 నవంబర్ 1 నుండి విజిట్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచ కప్ సమయంలో హయ్యా కార్డ్ హోల్డర్లను మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొంది. వాయు, భూమి, సముద్ర సరిహద్దుల ద్వారా వచ్చే సందర్శకులందరికి ఈ నిబంధన వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. తిరిగి 2022 డిసెంబర్ 23 నుండి విజిట్ వీసాలను పునఃప్రారంభించనున్నట్లు పేర్కొంది. హయ్యా కార్డ్ హోల్డర్లు 2023 జనవరి 23 వరకు దేశంలో ఉండడానికి అనుమతి ఉందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, ఖతార్ పౌరులు, నివాసితులు,GCC పౌరులు ఖతారీ ID కార్డును కలిగి ఉన్న వారికి మినహాయింపునిచ్చారు. అలాగే వ్యక్తిగత రిక్రూట్మెంట్ వీసాలు, వర్క్ ఎంట్రీ పర్మిట్లను కలిగి ఉన్నవారితోపాటు మానవతా కేసుల్లో వచ్చే వారికి తాజా నిబంధనల నుంచి మినహాయింపునిచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







