‘వాల్తేర్ వీరయ్య’ కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోలు మేము సైతం అంటున్నారు.!
- September 23, 2022మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా రూపొందుతోన్న ‘వాల్తేర్ వీరయ్య’కు అంతకంతకూ అంచనాలు పెరిగిపోతున్నాయ్. భారీ మల్టీ స్టారర్ రంగు పులుముకుంటున్నట్లుగా కనిపిస్తోంది ‘వాల్తేర్ వీరయ్య’.
ఇంతకీ అసలు విషయమేంటంటే, ఈ సినిమాలో అగ్ర హీరోలు వెంకటేష్తో పాటూ, నాగార్జున కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారనీ తాజాగా అందుతోన్న ఇన్సైడ్ సోర్సెస్ సమాచారం.
ఇప్పటికే ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. చిరంజీవికి సవతి తల్లి కొడుకు పాత్ర అనీ తెలుస్తోంది. అలాగే, వెంకటేష్ ఓ ఇంపార్టెంట్ గోస్ట్ రోల్ పోషిస్తున్నాడంటూ ఇటీవలే ఓ కొత్త ప్రచారం జోరందుకుంది.
తాజాగా మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. కింగ్ నాగార్జున కూడా ఈ సినిమాలో కీలక భాగస్వామి అవ్వబోతున్నాడట. కొన్ని నిముషాల నిడివి వున్న అతిథి పాత్ర కోసం నాగార్జునను దించుతున్నారట.
అయితే, ఈ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. కానీ, ఆ నోటా, ఈ నోటా లీకు వీరుల మాట ఇండస్ర్టీ గేటు బయట చక్కర్లు కొడుతోంది. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నారు.
మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎలా కోరుకుంటారో, అలాగే ఈ సినిమాలో చూపించబోతున్నాననీ బాబి ఆల్రెడీ చెప్పేశాడు. దాంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఈ సినిమా ముస్తాబవుతోంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు