యువకున్ని హత్య చేసిన మిలిటరీ వ్యక్తికి మరణ శిక్ష
- September 23, 2022
కువైట్: యువకున్ని హత్య చేసిన ఘటనలో మిలటరీలో పనిచేసిన వ్యక్తికి కువైట్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. జులాయి ఏడారిలో ఉన్న ఓ యువకున్ని మిలటరీలో పనిచేస్తున్న వ్యక్తి గొంతు నులిమి చంపాడు. విచారణలో అతను దోషిగా తేలాడు. దీంతో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. కువైట్ లో ఈ ఏడాదిలో ఇదే మొదటి హత్య కేసుగా నమోదైంది. దోషిగా తేలిన వ్యక్తికి గతంలోనూ నేర చరిత్ర ఉంది. హత్యకు కొన్ని వారాల ముందే అతను జైలు నుంచి విడుదలయ్యాడు. వేరే కేసులో అతనికి 15 ఏళ్ల జైలు శిక్ష వేశారు. ఐతే 10 ఏళ్లు శిక్ష అనుభవించిన తర్వాత క్షమాభిక్ష పెట్టటంతో ఇటీవలే విడుదలయ్యాడు. వచ్చిన కొన్ని రోజులకే యువకున్నిహత్య చేశాడు. తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకోవటంతో విచారణ వేగంగా పూర్తైంది.
తాజా వార్తలు
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!







