యువకున్ని హత్య చేసిన మిలిటరీ వ్యక్తికి మరణ శిక్ష

- September 23, 2022 , by Maagulf
యువకున్ని హత్య చేసిన మిలిటరీ వ్యక్తికి మరణ శిక్ష

కువైట్: యువకున్ని హత్య చేసిన ఘటనలో మిలటరీలో పనిచేసిన వ్యక్తికి కువైట్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. జులాయి ఏడారిలో ఉన్న ఓ యువకున్ని మిలటరీలో పనిచేస్తున్న వ్యక్తి గొంతు నులిమి చంపాడు. విచారణలో అతను దోషిగా తేలాడు. దీంతో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. కువైట్ లో ఈ ఏడాదిలో ఇదే మొదటి హత్య కేసుగా నమోదైంది. దోషిగా తేలిన వ్యక్తికి గతంలోనూ నేర చరిత్ర ఉంది. హత్యకు కొన్ని వారాల ముందే అతను జైలు నుంచి విడుదలయ్యాడు. వేరే కేసులో అతనికి 15 ఏళ్ల జైలు శిక్ష వేశారు. ఐతే 10 ఏళ్లు శిక్ష అనుభవించిన తర్వాత క్షమాభిక్ష పెట్టటంతో ఇటీవలే విడుదలయ్యాడు. వచ్చిన కొన్ని రోజులకే యువకున్నిహత్య చేశాడు. తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకోవటంతో విచారణ వేగంగా పూర్తైంది.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com