యువకున్ని హత్య చేసిన మిలిటరీ వ్యక్తికి మరణ శిక్ష
- September 23, 2022కువైట్: యువకున్ని హత్య చేసిన ఘటనలో మిలటరీలో పనిచేసిన వ్యక్తికి కువైట్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. జులాయి ఏడారిలో ఉన్న ఓ యువకున్ని మిలటరీలో పనిచేస్తున్న వ్యక్తి గొంతు నులిమి చంపాడు. విచారణలో అతను దోషిగా తేలాడు. దీంతో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. కువైట్ లో ఈ ఏడాదిలో ఇదే మొదటి హత్య కేసుగా నమోదైంది. దోషిగా తేలిన వ్యక్తికి గతంలోనూ నేర చరిత్ర ఉంది. హత్యకు కొన్ని వారాల ముందే అతను జైలు నుంచి విడుదలయ్యాడు. వేరే కేసులో అతనికి 15 ఏళ్ల జైలు శిక్ష వేశారు. ఐతే 10 ఏళ్లు శిక్ష అనుభవించిన తర్వాత క్షమాభిక్ష పెట్టటంతో ఇటీవలే విడుదలయ్యాడు. వచ్చిన కొన్ని రోజులకే యువకున్నిహత్య చేశాడు. తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకోవటంతో విచారణ వేగంగా పూర్తైంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం