విద్యార్థులపై దాడి ఘటనలో ఉపాధ్యాయుడు నిర్దోషి: విద్యాశాఖ
- September 24, 2022
బహ్రెయిన్: ఇద్దరు విద్యార్థులపై ఓ ఉపాధ్యాయుడు దాడి చేసినట్లు వీడియో ద్వారా తల్లిదండ్రులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. తాము చేసిన దర్యాప్తులో సదరు ఉపాధ్యాయుడు నిర్దోషి అని తేలిందని ప్రకటించింది. తమ విచారణలో ఓ విద్యార్థినే అసలు నిందితుడని తేలిందని పేర్కొంది. ఉపాధ్యాయుడిని అవమానించడం, రెచ్చగొట్టడం వంటి చర్యలకు విద్యార్థి పాల్పడ్డాడని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో విద్యార్థిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలాంటి విషయాల పట్ల తల్లిదండ్రులు, సోషల్ మీడియా వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని.. విషయాన్ని నిర్ధారించుకోవడానికి సంబంధిత అధికారులకు తెలపాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఉపాధ్యాయుడు తన కుమారుడిపై, గాయాలతో బాధపడుతున్న మరో విద్యార్థిపై దాడి చేశారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు విడుదల చేసి వీడియో వైరల్ కావడంతో విద్యా మంత్రిత్వ శాఖ విచారణ ప్రారంభించింది. ఈ ఘటన ఇసా టౌన్ ప్రైమరీ ప్రిపరేటరీ స్కూల్లో జరిగింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









