FIFA వరల్డ్ కప్.. అల్ బిడ్డా పార్క్ మూసివేత
- September 24, 2022
ఖతార్: అల్ బిడ్డా పార్క్లోని వాడి అల్ సెయిల్ ప్రాంతాన్ని మూసివేసినట్టు సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ & లెగసీ (SC) ప్రకటించింది. నవంబర్లో FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 ప్రారంభమయ్యే వరకు ఈ మూసివేత నిబంధన అమల్లో ఉంటుందని పేర్కొంది. 2022 నవంబర్ 20 నుండి డిసెంబర్ 18 వరకు ఫుట్బాల్ టోర్నమెంట్ సందర్భంగా అల్ బిడ్డా పార్క్లో జరిగే FIFA ఫ్యాన్ ఫెస్టివల్కు అవసరమైన సన్నాహాల కోసం మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సుప్రీం కమిటీ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ఫుట్బాల్ అభిమానులు అల్ బిడ్డా పార్క్లో జరిగే FIFA ఫ్యాన్ ఫెస్టివల్కు తరలివస్తారని వెల్లడించింది. ఇక్కడ ఫుట్ బాల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ప్రదర్శన ఉంటుందని, స్టేజ్ ప్రదర్శనలు, ఫుడ్ అవుట్లెట్లు, సాంస్కృతిక కార్యకలాపాలు, స్పాన్సర్ యాక్టివేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









