FIFA వరల్డ్ కప్.. అల్ బిడ్డా పార్క్ మూసివేత
- September 24, 2022
ఖతార్: అల్ బిడ్డా పార్క్లోని వాడి అల్ సెయిల్ ప్రాంతాన్ని మూసివేసినట్టు సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ & లెగసీ (SC) ప్రకటించింది. నవంబర్లో FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 ప్రారంభమయ్యే వరకు ఈ మూసివేత నిబంధన అమల్లో ఉంటుందని పేర్కొంది. 2022 నవంబర్ 20 నుండి డిసెంబర్ 18 వరకు ఫుట్బాల్ టోర్నమెంట్ సందర్భంగా అల్ బిడ్డా పార్క్లో జరిగే FIFA ఫ్యాన్ ఫెస్టివల్కు అవసరమైన సన్నాహాల కోసం మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సుప్రీం కమిటీ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ఫుట్బాల్ అభిమానులు అల్ బిడ్డా పార్క్లో జరిగే FIFA ఫ్యాన్ ఫెస్టివల్కు తరలివస్తారని వెల్లడించింది. ఇక్కడ ఫుట్ బాల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ప్రదర్శన ఉంటుందని, స్టేజ్ ప్రదర్శనలు, ఫుడ్ అవుట్లెట్లు, సాంస్కృతిక కార్యకలాపాలు, స్పాన్సర్ యాక్టివేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







