FIFA వరల్డ్ కప్.. అల్ బిడ్డా పార్క్ మూసివేత
- September 24, 2022
ఖతార్: అల్ బిడ్డా పార్క్లోని వాడి అల్ సెయిల్ ప్రాంతాన్ని మూసివేసినట్టు సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ & లెగసీ (SC) ప్రకటించింది. నవంబర్లో FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 ప్రారంభమయ్యే వరకు ఈ మూసివేత నిబంధన అమల్లో ఉంటుందని పేర్కొంది. 2022 నవంబర్ 20 నుండి డిసెంబర్ 18 వరకు ఫుట్బాల్ టోర్నమెంట్ సందర్భంగా అల్ బిడ్డా పార్క్లో జరిగే FIFA ఫ్యాన్ ఫెస్టివల్కు అవసరమైన సన్నాహాల కోసం మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సుప్రీం కమిటీ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ఫుట్బాల్ అభిమానులు అల్ బిడ్డా పార్క్లో జరిగే FIFA ఫ్యాన్ ఫెస్టివల్కు తరలివస్తారని వెల్లడించింది. ఇక్కడ ఫుట్ బాల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ప్రదర్శన ఉంటుందని, స్టేజ్ ప్రదర్శనలు, ఫుడ్ అవుట్లెట్లు, సాంస్కృతిక కార్యకలాపాలు, స్పాన్సర్ యాక్టివేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







