బాంబు దాడి కేసులో నిర్దోషిగా తేలిన వ్యక్తి...తనను సోషల్ మీడియాలో తిట్టిన వారిపై దావా
- September 24, 2022
కువైట్: ఆత్మాహుతి దాడి కేసులో నిర్దోషిగా తేలిన ఓ వ్యక్తి...తనను నిందితుడంటూ సోషల్ మీడియాలో తిట్టిన వారందరినీ కోర్టుకు లాగాడు. తనకు ఆ బాంబు దాడితో ఎలాంటి సంబంధం లేకపోయిన దాదాపు 4 వేల మంది ట్విట్టర్ లో తనను అసభ్యంగా తిట్టారంటూ వారందరిపై దావా వేశాడు. వివరాల్లోకి వెళితే 2015 లో కువైట్లోని షియా మసీదుపై ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఈ దాడిలో 27 మంది చనిపోయారు. ఐతే టెర్రరిస్టులు వాడిన కారు యాజమాని అంటూ పోలీసులు ఓ వ్యక్తి అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేయటంతో కోర్టు లో విచారణ జరిగింది. ఉగ్రదాడికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి కి ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిన కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. కానీ చాలా మంది ట్విట్టర్ లో అతన్ని తిడుతూ కామెంట్లు చేశారు. దీంతో ఆ వ్యక్తి ట్విట్టర్ లో తిట్టిన 4 వేల మందిపై దావా వేశారు. వాళ్లందరినీ గ్రూపులు, గ్రూపులుగా విచారించాలని కోర్టును కోరాడు. వారి ఫోన్ నంబర్లను కూడా న్యాయస్థానానికి అందజేశాడు. దీంతో ఈ ఘటన కువైట్ లో సంచలనంగా మారింది. ఐతే కోర్టు ఈ దావాను విచారిస్తుందో లేదా వేచి చూడాలి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









