ఈ నెల 27 న ఒమన్ లో పర్యటించనున్న యూఏఈ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జాయెద్

- September 26, 2022 , by Maagulf
ఈ నెల 27 న ఒమన్ లో పర్యటించనున్న యూఏఈ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జాయెద్

యూఏఈ :   యూఏఈ ప్రెసిడెంట్  షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మంగళవారం ఒమన్ వెళ్లనున్నారు. ఒమన్ రాజు  సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్‌ ఆహ్వానం మేరకు ఆయన రెండు రోజుల పాటు ఒమన్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సోదర సంబంధాలు, పలు రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొదించుకునే అంశాలపై చర్చించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న అవకాశాలు, పెట్టుబడులతో పాటు యువతకు ఉపాధికి గురించి ప్రధానంగా డిస్కస్ చేయనున్నారు. యూఏఈ ప్రెసిడెంట్ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఇరు దేశాల అధికారులు ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com