బాక్సాఫీస్ వద్ద తలపడనున్న మెగాస్టార్, కింగ్.! గెలుపెవరిదో.!
- September 26, 2022దసరా కానుకగా ఈ సారి బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయ్. టాలీవుడ్ అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమా ఒకటి కాగా, కింగ్ నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా ఇంకోటి.
అక్టోబర్ 5న ఈ రెండు సినిమాలూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయ్. రెండు సినిమాలూ పోటా పోటీగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నాయ్. ఇద్దరూ తమ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడంతో పాటూ, నా ఫ్రెండ్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ వుంది.. రెండు సినిమాలూ మంచి విజయం దక్కించుకోవాలని ఆశిస్తున్నాం.. అంటూ ఇద్దరూ చెబుతుండడం విశేషం.
అన్నట్లు ఈ రెండు సినిమాలపైనా మంచి అంచనాలున్నాయ్. రెండూ బాలీవుడ్లో రిలీజ్ అవుతున్న సినిమాలే. ‘ఆచార్య’ ఫ్లాప్ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సినిమా ‘గాడ్ ఫాదర్’. రీమేక్ సినిమానే అయినా భారీ కాస్టింగ్తో భారీ అంచనాలతో చిరంజీవి ఇమేజ్ని మరింత రెట్టింపు చేసేలా ఈ సినిమాని మోహన్ రాజా తెరకెక్కించారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాత్ర సినిమాకి మరో అస్సెట్. నయనతార, సత్యదేవ్, సునీల్, పూరీ జగన్నాధ్ తదితరులు ఇతర కీలక తారాగణం. అలాగే నాగార్జున ‘ది ఘోస్ట్’ విషయానికి వస్తే, విషయమున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటిస్తోంది.
నువ్వా.? నేనా.? అంటూ దసరా బరిలో దిగుతోన్న ఈ రెండు సినిమాల్లోనూ అసలు సిసలు విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?