ఇండియాకు వెళ్తున్నారా.. మాస్క్ తప్పనిసరి
- September 28, 2022
యూఏఈ: కొవిడ్ భద్రతా చర్యలలో యూఏఈ పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. వైద్య సదుపాయాలు, మస్జీదులు, ప్రజా రవాణా మార్గాలు మినహా యూఏఈలోని అన్ని బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించడం ఐచ్ఛికం చేశారు. ఈ క్రమంలో దుబాయ్కు చెందిన ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్ కొత్త మాస్క్ మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయి. రెండు విమానయాన సంస్థలు దుబాయ్ నుండి ప్రయాణించే లేదా దుబాయ్ గుండా ప్రయాణించే ప్రయాణీకులను వారి స్వదేశంలోని మాస్క్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నాయి. విమానాల లోపల మాస్క్ ధరించడం ఇకపై తప్పనిసరి కాకున్నా.. విమానయాన సంస్థలు ఈ నిబంధనను అమలు చేయవచ్చని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రయాణీకులు భారత ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని







