ఇండియాకు వెళ్తున్నారా.. మాస్క్ తప్పనిసరి
- September 28, 2022
యూఏఈ: కొవిడ్ భద్రతా చర్యలలో యూఏఈ పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. వైద్య సదుపాయాలు, మస్జీదులు, ప్రజా రవాణా మార్గాలు మినహా యూఏఈలోని అన్ని బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించడం ఐచ్ఛికం చేశారు. ఈ క్రమంలో దుబాయ్కు చెందిన ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్ కొత్త మాస్క్ మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయి. రెండు విమానయాన సంస్థలు దుబాయ్ నుండి ప్రయాణించే లేదా దుబాయ్ గుండా ప్రయాణించే ప్రయాణీకులను వారి స్వదేశంలోని మాస్క్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నాయి. విమానాల లోపల మాస్క్ ధరించడం ఇకపై తప్పనిసరి కాకున్నా.. విమానయాన సంస్థలు ఈ నిబంధనను అమలు చేయవచ్చని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రయాణీకులు భారత ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









