హైదరాబాద్లో ట్రాఫిక్ కొత్త రూల్స్..
- September 30, 2022హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇకపై కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలు కానున్నాయి. అధికారులు ట్రాఫిక్ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి ఇకపై పోలీసులు భారీ జరిమానాలు విధించబోతున్నారు.
సోమవారం నుంచి ట్రాఫిక్ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం.. సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటి వాహనదారులు ముందుకొస్తే రూ.100 ఫైన్. అలాగే ఫుట్పాత్లను దుకాణదారులు ఆక్రమించి, వారికి సంబంధించిన ఏవైనా వస్తువులు పెడితే భారీ జరిమానా విధిస్తారు. అలాగే పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తే రూ.600 జరిమానా ఉంటుంది. వాహనదారులు ఫ్రీ లెఫ్ట్ను బ్లాక్ చేసి, ఇతర వాహనాలు వెళ్లకుండా చేస్తే రూ.1,000 జరిమానా. తాజా నిబంధనలకు అనుగుణంగా సోమవారం నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ లేకుండా ప్రయాణించిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సిబ్బంది
- ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు
- దుబాయ్ ఆర్టీఏ బస్సు ఉల్లంఘనలు.. జరిమానాల జాబితా
- నితాఖత్ కింద సౌదీలుగా ఫారీన్ ఇన్వెస్టర్లు
- డొమెస్టిక్ లేబర్ ప్రొబేషన్ వ్యవధి 6 నెలలకు పెంపు..!
- అబుదాబిలోని అత్యంత ఖరీదైన పెంట్హౌస్ సేల్
- కువైట్ లో పెరుగుతున్న ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్..!
- ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్లికేషన్లలో 12.59% పెరుగుదల
- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ