అక్టోబర్ 31 నుంచి విజయవాడ-షార్జా మధ్య విమాన సర్వీసులు
- October 01, 2022
విజయవాడ: అక్టోబర్ 31 నుండి షార్జా-విజయవాడ-షార్జా మార్గంలో వారానికి రెండుసార్లు(సోమవారం, శనివారం) విమానాలను నడుపనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకటించింది. తమ వెబ్సైట్లో టిక్కెట్ బుకింగ్ ను ప్రారంభించినట్లు తెలిపింది. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం.. విమానం షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఉదయం 11 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.25 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.35 గంటలకు షార్జాకు బయలుదేరుతుంది. టిక్కెట్ ధర ₹12,000 నుండి ప్రారంభమవుతుందని విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఒమన్లోని మస్కట్కు వారానికి ఒక సర్వీసు(ప్రతి మంగళవారం) నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. షార్జాకు మరో రెండు సర్వీసులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. షార్జా, మస్కట్ లకు నేరుగా విమాన సర్వీసు ఉండటం వల్ల ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాల్లో పని చేసే అనేకమందికి ఇది ఉపయోగపడుతుందన్నారు.
తాజా వార్తలు
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!
- అహ్మదీ గవర్నరేట్లో 8 మంది స్ట్రీట్ వెండర్స్ అరెస్టు..!!
- యూఏఈలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం..!!
- కిడ్స్ గో ఫ్రీ ప్రచారాన్ని ప్రారంభించిన విజిట్ ఖతార్..!!









