టెహ్రన్ లో ఓ పోలీస్ స్టేషన్ పై వేర్పాటు వాదుల దాడి. 19 మంది మృతి
- October 02, 2022
టెహ్రాన్: టెహ్రాన్ లోని సౌత్ ఈస్ట్రన్ లో ఓ పోలీస్ స్టేషన్ పై వేర్పాటు వాదులు ఆటాక్ చేశారు. బాంబులతో దాడి చేసిన అనంతరం కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఎలైట్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ నలుగురు సహా మొత్తం 19 మంది చనిపోయారు. నమాజ్ కు వచ్చిన వారిలో కలిసిపోయిన దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాసిజీ బలగాలతో సహా 32 మంది గార్డ్ లు కూడా గాయపడ్డారు. ఐతే ఈ దాడి వేర్పాటు వాద గ్రూప్ చేసిందేనని ప్రభుత్వం ప్రకటించింది. కానీ హిజాబ్ కు సంబంధించిన పోలీస్ కస్టడీలో 22 ఏళ్ల యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళనల్లో భాగంగా నిరసనకారులు దాడి చేసి ఉంటారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఐతే విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల









