టెహ్రన్ లో ఓ పోలీస్ స్టేషన్ పై వేర్పాటు వాదుల దాడి. 19 మంది మృతి

- October 02, 2022 , by Maagulf
టెహ్రన్ లో ఓ పోలీస్ స్టేషన్ పై వేర్పాటు వాదుల దాడి. 19 మంది మృతి

టెహ్రాన్: టెహ్రాన్ లోని సౌత్ ఈస్ట్రన్ లో ఓ పోలీస్ స్టేషన్ పై వేర్పాటు వాదులు ఆటాక్ చేశారు. బాంబులతో దాడి చేసిన అనంతరం కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఎలైట్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ నలుగురు సహా మొత్తం 19 మంది చనిపోయారు. నమాజ్ కు వచ్చిన వారిలో కలిసిపోయిన దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాసిజీ బలగాలతో సహా 32 మంది గార్డ్ లు కూడా గాయపడ్డారు. ఐతే ఈ దాడి వేర్పాటు వాద గ్రూప్ చేసిందేనని ప్రభుత్వం ప్రకటించింది. కానీ హిజాబ్ కు సంబంధించిన పోలీస్ కస్టడీలో 22 ఏళ్ల యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళనల్లో భాగంగా నిరసనకారులు దాడి చేసి ఉంటారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఐతే విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com