మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- October 02, 2022
            కౌలాలంపూర్: మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో పూల పండుగ ఘనంగా జరిగింది.తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిదర్శనమైన ఈ బతుకమ్మ పండుగను రెండు సంవత్సరాల తరువాత ఘనంగా నిర్వహించడంతో ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.మలేషియా కౌలాలంపూర్ లోని డీ చక్ర రూఫ్ టాప్ హాల్, TLK కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్, కులాలంపూర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సాంప్రదాయ దుస్తులతో, ఆకర్షణీయమయిన పూలతో చేసిన బతుకమ్మలను చిన్నా పెద్దా యువతులనే తేడా లేకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా ఆడి పాడి సందడి చేసారు.
ఈ సంబరాలకు ముఖ్య అతిధులుగా తెరాస పార్టీ శాసన సభ సభ్యుడు గాదారి కిషోర్ కుమార్, బీజేపీ శాసన సభ సభ్యుడు రఘు నందన్, సూర్యాపేట జిల్ల్లా పరిషద్ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్, ఇండియన్ హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ సుష్మ, మరియు మలేషియా తెరాస వింగ్ ప్రెసిడెంట్ చిట్టిబాబు పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు.
రఘునందన్ మాట్లాడతూ ఈ సంబరాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ ను ఆయన అభినందించారు.మలేషియా వచ్చి ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారికి ప్రమాదవశాతూ మరణించిన వారికీ మైట తరపున సహాయ సహకారాలు అందచేస్తున్న మైట కోర్ కమిటీ సబ్యులను అభినందించారు ఇలాంటి సహాయ కార్యక్రమాలు మునుముందు ఇలాగే కొనసాగించాలని కోరారు దీనికి కావాలసిన సహాయ సహకారాలు భారత ప్రభుత్వం తరపున మరియు తెలంగాణ ప్రభుతం తరపున శాసన సభ సభ్యుడి గ హామీ ఇచ్చారు.
గాదారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మలేషియా లో ఇంత ఘనంగా బతుకమ్మ సంబరాలను జరుపుతున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ అభినందించారు. మైట చేస్తున్న సేవాకార్యక్రమాలు అభినందిస్తూ అలాగే తెలంగాణ వారికి ఏ సమస్య వచ్చిన మైట మరియు తెలంగాణ ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు అలాగే మైట కు కావలసిన సహాయ సహకారాలు తెలంగాణ ప్రభుత్వం తరఫును ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సంధర్బముగా నిర్వహించిన ఉత్సవాలలో ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాలా పాటలు పాడారు. ఈ వేడుకల్లో సుమారుగా వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు, రుచికరమైన తెలంగాణ వంటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి అలాగే అందంగా అలంకరించిన బతుకమ్మల కు జెన్ టాక్టు కంపెనీ తరపున కృష్ణ వర్మ గారు 6గ్రాముల బంగారు బహుమతులను అందజేశారు అంతే కాకుండా లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన వారికీ KVT గోల్డ్ ,మలబార్ గోల్డ్ ,జస్ బెలూన్స్ వారు బంగారు బహుమతులను అందజేశారు.
మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు.ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా వచ్చిన ఏవౌస్, జెన్ టాక్టు, లావు టెక్ సోలుషన్స్ , అక్యూమెంట్ ఇన్ఫోటెక్ , ఆలివ్ టెక్నాలజీస్ , తెరాస మలేషియా , మలబార్ గోల్డ్ , KVT గోల్డ్, జాస్ డెకొరేటర్స్ ,మినీ మార్ట్ అప్,ట్రూ ఫ్రెషిస్, శ్రీ బిర్యానీ.com రెస్టారెంట్ , మై81 రెస్టారెంట్ , బిగ్ సి రెస్టారెంట్ , ప్రబలీ రెస్టారెంట్ , ఫామిలీ గార్డెన్ రెస్టారెంట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం కావడానికి సహకరించిన మైట కోర్ కమిటీ ని వాలంటీర్లు గా ముందుకి వచ్చిన సభ్యులను, మరియు మైట సభ్యులను అయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేసరర్ మారుతీ జాయింట్ ట్రేసరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రవి వర్మ,కృష్ణ వర్మ, వివేక్, రాములు, సుందర్, కృష్ణరెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, అశ్విత ,యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్-కిరణ్ గౌడ్, రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ చందు, రామ కృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరని, ఇందు, రోజా, శ్రీలత. మైగ్రంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్, సందీప్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 - తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 







