జోర్డాన్ రాజు పర్యటన.. స్కూల్స్ మూసివేత
- October 03, 2022
మస్కట్: జోర్డాన్ రాజు పర్యటన కారణంగా మస్కట్లోని పాఠశాలలు మంగళవారం మధ్యాహ్నం తర్వాత మూసివేయనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం.. సీబ్, బాషర్, ముత్రా, మస్కట్, అమెరత్లోని విలాయత్లలోని పాఠశాలలు మంగళవారం ఉదయం 11.30 గంటలకు మూసివేయనున్నారు. అలాగే మంగళవారం సీబ్, అమెరత్లలో సాయంత్రం పాఠశాలలు పనిచేయవని విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జోర్డాన్ రాజ్యం రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఒమన్ సుల్తానేట్ను అధికారిక పర్యటన నిమిత్తం మంగళవారం రానున్నారు. ఆయన రాజ్యంలో రెండు రోజులు ఉండనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









