అధికారిక పత్రాల ఫోర్జరీ.. నిందితులకు జైలుశిక్ష, భారీ జరిమానా

- October 03, 2022 , by Maagulf
అధికారిక పత్రాల ఫోర్జరీ.. నిందితులకు జైలుశిక్ష,  భారీ జరిమానా

రియాద్: సౌదీ రాయబార కార్యాలయాలలో ఒకదానిలో అధికారిక పత్రాలను ఫోర్జరీ చేసినందుకు నలుగురు పౌరులతో కూడిన క్రిమినల్ గ్యాంగ్ సభ్యులకు కోర్టు జైలుశిక్షతోపాటు భారీ జరిమానా విధించినట్లు పబ్లిక్ ట్రస్ట్ ప్రాసిక్యూషన్‌ తెలిపింది. నిందితులు ఎంబసీలోని అధికారిక పత్రాలను తయారు చేయడంతోపాటు వాటితో ఇతరుల ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు విదేశాలలో ఉన్న సౌదీ రాయబార కార్యాలయాలలో సమర్పించినట్లు పేర్కొంది. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. అన్ని ఆధారాలను పరిశీలించిన కోర్టు.. నిందితులకు 20 సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు SR400,000 జరిమానా విధించబడింది. దీంతోపాటు నిందితులు అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి వారి యజమానులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com