మళ్లీ బాలిస్టిక్ మిస్సైల్ను పరీక్షించిన ఉత్తర కొరియా
- October 04, 2022
మళ్లీ బాలిస్టిక్ మిస్సైల్ను పరీక్షించిన ఉత్తర కొరియా
సియోల్: ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిందని మంగళవారం దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఉత్తర కొరియా తూర్పు వైపున జపాన్ గగనతలం మీదుగా గుర్తు తెలియని బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, జపాన్ కోస్ట్గార్డ్ సైతం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు ధ్రువీకరించింది. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ప్రజలకు సూచించింది.
ఉత్తర కొరియా మిస్సైల్ ప్రయోగంపై జపాన్ ప్రధాని కిషిదా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. అణ్వాయుధాలు కలిగి ఉన్న ఉత్తర కొరియా ఈ ఏడాది రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహించింది. గతవారం నాలుగుసార్లు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ను పరీక్షించింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్తో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడంతోపాటు ఆ దేశంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పర్యటించడంతో ఆగ్రహానికి గురైన ఉత్తర కొరియా వరుసగా క్షిపణులను పరీక్షిస్తున్నది. అయితే, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరో అను పరీక్షకు సిద్ధమవుతున్నారని దక్షిణ కొరియా, అమెరికా వర్గాలు గత కొద్ది నెలలుగా హెచ్చరిస్తున్నాయి. అక్టోబర్ 16న జరుగబోయే చైనా పార్టీ కాంగ్రెస్ తర్వాత జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పబ్లిక్ పాస్టింగ్ వయోలేషన్..జైలుశిక్ష లేదా BD100 ఫైన్..!!
- మస్కట్లో యువతిని ఢీకొట్టిన డ్రైవర్ అరెస్ట్..!!
- గాజాకు యూఏఈ $1.2 బిలియన్ల విరాళం..!!
- గుడ్ న్యూస్.. తగ్గనున్న బ్యాంకింగ్ సర్వీస్ ఫీజులు..!!
- ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన అమీర్..!!
- భద్రతా సంసిద్ధతపై కువైట్ ప్రధాని సమీక్ష..!!
- రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్









