ఒమన్లో 50 మందికిపైగా చొరబాటుదారులు అరెస్ట్
- October 06, 2022
మస్కట్: 50 మందికిపైగా చొరబాటుదారులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ఒమన్ సుల్తానేట్లోకి పెద్ద మొత్తంలో పొగాకును అక్రమంగా తరలించడానికి చేసిన నాలుగు ప్రయత్నాలను విఫలం చేసినట్లు వారు పేర్కొన్నారు. ధోఫర్ గవర్నరేట్లోని కోస్ట్ గార్డ్ పోలీసులు.. నాలుగు స్మగ్లింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నారన్నారు. ఈ ఘటనలకు సంబంధించి 51 మంది చొరబాటుదారులు, ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో పొగాకును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసిన చొరబాటుదారులపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసినట్లు ROP ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







