ఒమన్లో 50 మందికిపైగా చొరబాటుదారులు అరెస్ట్
- October 06, 2022
మస్కట్: 50 మందికిపైగా చొరబాటుదారులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ఒమన్ సుల్తానేట్లోకి పెద్ద మొత్తంలో పొగాకును అక్రమంగా తరలించడానికి చేసిన నాలుగు ప్రయత్నాలను విఫలం చేసినట్లు వారు పేర్కొన్నారు. ధోఫర్ గవర్నరేట్లోని కోస్ట్ గార్డ్ పోలీసులు.. నాలుగు స్మగ్లింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నారన్నారు. ఈ ఘటనలకు సంబంధించి 51 మంది చొరబాటుదారులు, ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో పొగాకును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసిన చొరబాటుదారులపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసినట్లు ROP ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







