దర్వాజాత్ అల్-అబ్దుల్ రజాక్ టన్నెల్ మరమ్మతు పనులు ప్రారంభం
- October 07, 2022
కువైట్: దర్వాజాత్ అల్-అబ్దుల్ రజాక్ టన్నెల్ మరమ్మతు పనులను పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ప్రారంభించింది. పబ్లిక్ వర్క్స్ మంత్రి, విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి అలీ అల్-మౌసా మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీ అల్-మౌసా మాట్లాడుతూ.. తనిఖీ, పరీక్షలు, టన్నెల్ బాడీ కోసం కాంక్రీట్ పనులు, ఇన్సులేషన్ లేయర్లను తొలగించడం, యాంకర్ ప్లాట్ఫారమ్లను మార్చడం వంటి పనులు పూర్తి కావడానికి 90 రోజులు పట్టవచ్చన్నారు. కువైట్ నగరం నడిబొడ్డున ఉన్న టన్నెల్ సొరంగంలో పగుళ్లు కనిపించడంతో సుమారు రెండు సంవత్సరాల కిందట అధికారులు దీన్ని మూసివేశారు.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









