శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

- October 07, 2022 , by Maagulf
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన EK-524 విమానంలో ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు.ఈ క్రమంలో ఇద్దరి వద్ద అక్రమంగా తరలిస్తున్న 2800 గ్రాముల బంగారాన్ని గుర్తించారు.

దీంతో అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. బంగారాన్ని కడ్డీల రూపంలో తరలిస్తున్నారని, దాని విలువ Rs. 1.47 కోట్లకు పైగా ఉంటుందని అధికారుల వెల్లడించారు. ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com