నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- November 15, 2025
హైదరాబాద్: ఇటీవల ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి.ఫేక్ ఖాతాలతో ప్రజల్ని మోసగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. అయితే ఈమధ్య సైబర్ నేరగాళ్లు కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. సెలబ్రిటీలు, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లతో నకిలీ ఖాతాలను స సృష్టిస్తున్నారు. వారి పేరుతో డబ్బును డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ పేరుతో నకిలీ ఖాతాలతో ప్రజలను మోసగించే మెసేజ్ లను పంపుతున్నారు.
తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టించారని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ తెలిపారు.ఆపదలో ఉన్నానని.. డబ్బులు పంపాలని మోసపూరిత మెసేజ్ లు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఓ స్నేహితుడు నిజమని నమ్మి రూ.20వేలు పంపిమోసపోయారని చెప్పారు.
డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్ లను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద లింక్ లు, మెసేజ్ లు, వీడియో కాల్స్ వస్తే బ్లాక్ చేయాలని సూచించారు. ఆయా సైట్లు బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ మోసాలపై 1930 హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని కోరారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







