రెండు నెలల్లో 6,112 మందిని బహిష్కరించిన కువైట్
- October 11, 2022
కువైట్: రెసిడెన్సీ, వర్క్ చట్టాన్ని ఉల్లంఘించిన 6,112 మందిని గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బహిష్కరించినట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) తెలిపింది. రెసిడెన్సీ వ్యవహారాల ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చేపట్టిన తనిఖీల్లో ఆగస్టులో 585, సెప్టెంబర్లో 204 మంది సహా 789 మంది చట్టాలను ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసినట్లు మంత్రిత్వ శాఖ భద్రతా మీడియా, పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు మరో 45 మందిని ఇదే కారణంతో అరెస్టు చేసినట్లు పేర్కొంది. పౌరులు, నివాసితులు భద్రతా సిబ్బందితో సహకరించాలని కోరింది. రెసిడెన్సీ, వర్క్ చట్టాలను అందరూ గౌరవించాలని, ఉల్లంఘనదారుల గురించిన సమాచారాన్ని దాచవద్దని, సంబంధిత అధికారులకు సమాచారాన్ని తెలపాలని విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
- అనకాపల్లిలో 'సిరివెన్నెల స్మృతివనం'
- ఏపీ ప్రభుత్వం దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు
- రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. CM విజయ్ సంచలన నిర్ణయం
- నకిలీ ట్రావెల్ ఆఫర్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- గత 48 గంటల్లో 6 శత్రు డ్రోన్లను కూల్చివేసిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు
- రేపు 20వ తేదీ దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
- టాప్-100 IASల్లో తెలంగాణ ఆఫీసర్లు ముగ్గురు
- ఎబోలా భయంతో మూడు దేశాల ప్రయాణికుల ప్రవేశంపై బహ్రెయిన్ ఆంక్షలు
- ఫుజైరాలో తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ పూర్తి చేసిన ఎతిహాద్ రైల్









