రెండు నెలల్లో 6,112 మందిని బహిష్కరించిన కువైట్
- October 11, 2022
కువైట్: రెసిడెన్సీ, వర్క్ చట్టాన్ని ఉల్లంఘించిన 6,112 మందిని గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బహిష్కరించినట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) తెలిపింది. రెసిడెన్సీ వ్యవహారాల ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చేపట్టిన తనిఖీల్లో ఆగస్టులో 585, సెప్టెంబర్లో 204 మంది సహా 789 మంది చట్టాలను ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసినట్లు మంత్రిత్వ శాఖ భద్రతా మీడియా, పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు మరో 45 మందిని ఇదే కారణంతో అరెస్టు చేసినట్లు పేర్కొంది. పౌరులు, నివాసితులు భద్రతా సిబ్బందితో సహకరించాలని కోరింది. రెసిడెన్సీ, వర్క్ చట్టాలను అందరూ గౌరవించాలని, ఉల్లంఘనదారుల గురించిన సమాచారాన్ని దాచవద్దని, సంబంధిత అధికారులకు సమాచారాన్ని తెలపాలని విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- ఇరాన్తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!









