ఇకపై మహిళా యాత్రికులతో ‘మహరం’ అవసరం లేదు: హజ్ మంత్రి
- October 11, 2022
సౌదీ : ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండి అయినా హజ్ లేదా ఉమ్రా చేయడానికి సౌదీ అరేబియాకు వెళ్లాలనుకునే మహిళా యాత్రికులతో పాటు మహరం (రక్త సంబంధీకులు) ఇకపై అవసరం లేదని సౌదీ హజ్, ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా ప్రకటించారు. సోమవారం కైరోలోని సౌదీ రాయబార కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మహిళా యాత్రికులతో పాటు మహర్మ్ అవసరమా లేదా అనే దానిపై కొనసాగుతున్న వివాదానికి మంత్రి ముగింపు పలికారు. మక్కాలోని గ్రాండ్ మస్జీదు విస్తరణ ఖర్చులు SR200 బిలియన్లు దాటిపోయాయని, పవిత్ర మస్జీదు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద విస్తరణ కొనసాగుతోందని మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఉమ్రా వీసాల సంఖ్యకు ఎటువంటి కోటా లేదా సీలింగ్ లేదని అల్-రబియా చెప్పారు. రెండు పవిత్ర మస్జీదులను సందర్శించాలనుకునే వారికి మంత్రిత్వ శాఖ అందించే సేవలను డిజిటలైజేషన్ చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల పరిచయం, ఉపయోగం గురించి ఇటీవలి కాలంలో రాజ్యం చేసిన మార్పులను మంత్రి అల్-రబియా వివరించారు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







