ఇకపై మహిళా యాత్రికులతో ‘మహరం’ అవసరం లేదు: హజ్ మంత్రి
- October 11, 2022
సౌదీ : ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండి అయినా హజ్ లేదా ఉమ్రా చేయడానికి సౌదీ అరేబియాకు వెళ్లాలనుకునే మహిళా యాత్రికులతో పాటు మహరం (రక్త సంబంధీకులు) ఇకపై అవసరం లేదని సౌదీ హజ్, ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా ప్రకటించారు. సోమవారం కైరోలోని సౌదీ రాయబార కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మహిళా యాత్రికులతో పాటు మహర్మ్ అవసరమా లేదా అనే దానిపై కొనసాగుతున్న వివాదానికి మంత్రి ముగింపు పలికారు. మక్కాలోని గ్రాండ్ మస్జీదు విస్తరణ ఖర్చులు SR200 బిలియన్లు దాటిపోయాయని, పవిత్ర మస్జీదు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద విస్తరణ కొనసాగుతోందని మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఉమ్రా వీసాల సంఖ్యకు ఎటువంటి కోటా లేదా సీలింగ్ లేదని అల్-రబియా చెప్పారు. రెండు పవిత్ర మస్జీదులను సందర్శించాలనుకునే వారికి మంత్రిత్వ శాఖ అందించే సేవలను డిజిటలైజేషన్ చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల పరిచయం, ఉపయోగం గురించి ఇటీవలి కాలంలో రాజ్యం చేసిన మార్పులను మంత్రి అల్-రబియా వివరించారు.
తాజా వార్తలు
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- ఇరాన్తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!









