అద్భుత పూల ప్రదర్శనలతో ప్రారంభమైన దుబాయ్ మిరాకిల్ గార్డెన్
- October 11, 2022
దుబాయ్: దుబాయ్ మిరాకిల్ గార్డెన్ పదకొండవ సీజన్ ప్రారంభమైంది. ప్రపంచంలోని అతిపెద్ద సహజ పూల తోట సందర్శకులు మునుపెన్నడూ చూడని పూల, నీటి నేపథ్య ఆకర్షణలను ఈసారి కొత్తగా ఏర్పాటు చేసినట్లు దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సృష్టికర్త, సహ వ్యవస్థాపకుడు ఇంజనీర్ అబ్దెల్ నాజర్ రహల్ వెల్లడించారు. నవంబర్ 20న పోటీ అధికారికంగా ప్రారంభమైనప్పుడు ది స్మర్ఫ్స్లోని దిగ్గజ పాత్రలు ఈ సంవత్సరం FIFA ప్రపంచ కప్లో పాల్గొనే వివిధ దేశాల జెర్సీలను ధరిస్తారని తెలిపారు. ఈ పాత్రలు నాలుగు మీటర్ల ఎత్తులో నిలబడి తోటలోని సుందరమైన పూలతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయన్నారు. కొత్తగా 'ఫ్లోరల్ టన్నెల్స్' ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ కుటుంబాలు విశ్రాంతి తీసుకోవచ్చని, భోజనాన్ని ఆస్వాదించవచ్చన్నారు. అలాగే ఈ సీజన్లో వినూత్నమైన 3-D నీరు, లైటింగ్ ఇన్స్టాలేషన్లు, సరస్సుల లోపల నీటి మిల్లులు కనిపిస్తాయన్నారు. దుబాయ్ల్యాండ్ నడిబొడ్డున 72,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ 120 కంటే ఎక్కువ రకాల 150 మిలియన్ల సహజ పుష్పాలకు ఆతిథ్యం ఇస్తుంది. ఈ ఉద్యానవనంలో వినోదం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉన్నాయి. దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ప్రతిరోజూ ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 వరకు.. వారాంతపు రోజులలో (శనివారం, ఆదివారం), ప్రభుత్వ సెలవు దినాలలో ఉదయం 9:00 నుండి రాత్రి 11:00 వరకు తెరిచి ఉంటుంది. ఎంట్రీ టిక్కెట్ల ధర పెద్దలకు (12 ఏళ్లు పైబడిన వారికి) Dhs75, 12 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు Dhs60. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, దివ్యాంగులు ఉచితంగా సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
- అనకాపల్లిలో 'సిరివెన్నెల స్మృతివనం'
- ఏపీ ప్రభుత్వం దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు
- రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. CM విజయ్ సంచలన నిర్ణయం
- నకిలీ ట్రావెల్ ఆఫర్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- గత 48 గంటల్లో 6 శత్రు డ్రోన్లను కూల్చివేసిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు
- రేపు 20వ తేదీ దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
- టాప్-100 IASల్లో తెలంగాణ ఆఫీసర్లు ముగ్గురు
- ఎబోలా భయంతో మూడు దేశాల ప్రయాణికుల ప్రవేశంపై బహ్రెయిన్ ఆంక్షలు
- ఫుజైరాలో తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ పూర్తి చేసిన ఎతిహాద్ రైల్









