మస్కట్ గవర్నరేట్లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం
- October 11, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ఓ ఇంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేసినట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు నమోదు కాలేదని తెలిపింది. ప్రమాదం సమచారం అందగానే మస్కట్ గవర్నరేట్లోని పౌర రక్షణ, అంబులెన్స్ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు సీబ్లోని విలాయత్లోని దక్షిణ మాబిలా ప్రాంతంలోని సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయని, ఇంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంటిలో పొగ, గ్యాస్ లీకేజీ డిటెక్టర్లను పెట్టుకోవడం, ప్రమాదాలను నివారించడానికి విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించిన వెంటనే వాటిని ఆఫ్ చేయడం వంటి విషయాల ప్రాముఖ్యతను అధికార యంత్రాంగం సూచించింది. అగ్నిప్రమాదాల సమయంలో మంటలు వ్యాపించకుండా చూడాలని, వృద్ధులకు సహాయం చేయడం , పిల్లలు/వికలాంగులు మంటల నుంచి దూరంగా తరలించాలని సూచించింది. అత్యవసర నంబర్ (9999) లేదా అథారిటీ యొక్క ఆపరేషన్ సెంటర్ (24343666)కి కాల్ చేయాలని కోరింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







