క్రూజ్ బోటులో 60 కిలోల మత్తుపదార్థాలు స్వాధీనం

- October 11, 2022 , by Maagulf
క్రూజ్ బోటులో 60 కిలోల మత్తుపదార్థాలు స్వాధీనం

కువైట్: కువైట్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన క్రూజ్ బోట్‌ను కోస్ట్ గార్డ్ అడ్డగించింది. అనంతరం చేపట్టిన తనిఖీల్లో బోటులో దాచిన 90 కిలోల మత్తుపదార్థాన్ని గుర్తించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి సరుకు రవాణా యజమాని సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా క్రూజ్ బోటులో 60 కిలోల మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్నభద్రతా బృందాలను ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అంతర్గత వ్యవహారాల తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అభినందించారు. సీజ్ చేసిన మాదకద్రవ్యాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ అల్-బర్జాస్, పోర్ట్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ మన్సూర్ అల్-అవాడి, కోస్ట్ గార్డ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ తలాల్ అల్-మౌన్స్ ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com