సౌదీ.. స్కూల్ బస్సులో బాలుడి మృతిపై విద్యాశాఖ సీరియస్
- October 11, 2022
మక్కా: తూర్పు సౌదీ అరేబియాలోని ఖతీఫ్లోని హలత్ మహిష్ పట్టణంలో ఆదివారం పాఠశాల బస్సులో 5 ఏళ్ల బాలుడు మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో విషాద వాతారణం నెలకొన్నది. ఆదివారం అల్-నఖీల్ కిండర్ గార్టెన్కు వెళ్లాల్సిన బస్సులో హసన్ హషీమ్ అల్-షోలా అనే బాలుడు మరణించిన ఘటనపై విచారణ జరుగుతున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ‘‘స్కూల్ నుంచి ఉదయం 11:20 గంటలకు తన కొడుకు ఆ రోజు పాఠశాలకు ఎందుకు రాలేదని ఫోన్ వచ్చింది. నేను షాకయ్యాను. ఉదయం తామే స్వయంగా తమ కుమారుడిని స్కూల్ బస్సు ఎక్కించాం. అనంతరం స్కూల్ బస్సులో హసన్ కదలకుండా పడి ఉన్నాడని తెలిపారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసకుపోవాలని సూచించాం. అప్పటికే తమ కుమారుడు చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు.’’ అని హసన్ తండ్రి హషీమ్ అల్-షోలా వాపోయాడు. తరగతులు ప్రారంభమైన వెంటనే స్కూల్ యాజమాన్యం మమ్మల్ని సంప్రదించి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదన్నారు. మరోవైపు తూర్పు ప్రావిన్స్లోని విద్యా శాఖ హసన్ కుటుంబానికి తన సానుభూతిని తెలియజేసింది. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, వాహనంలో విద్యార్థులు ఎవరూ లేరని నిర్ధారించుకోవడంలో విఫలమయ్యాడని స్పష్టంగా తెలుస్తుందని డిపార్ట్మెంట్ ప్రతినిధి సయీద్ అల్-బహెస్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







