గోవాలో కుప్పకూలిన మిగ్-29కే యుద్ధ విమానం
- October 12, 2022
న్యూఢిల్లీ: గోవా తీరంలో ఓ మిగ్-29 కే యుద్ధ విమానం కుప్పకూలింది.ఈ ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు.సాంకేతిక లోపం కారణంగానే మిగ్-29 కే కూలిపోయినట్లు నేవీ అధికారులు భావిస్తున్నారు.కాగా, మిగ్-29 కే యుద్ధవిమానాలు 2019 లో ఇండియన్ నేవీలో చేరిన తర్వాత కూలిపోవడం ఇది నాలుగోసారి.విమానం సముద్రం మీదుగా ఎగురుతుండగా సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కూలిపోయింది. నేవీ అధికారులు వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం వలన పైలట్ సురక్షింతంగా బయటపడ్డాడు. శిక్షణలో వినియోగిస్తున్న ఈ విమానం నేవీ స్థావరానికి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై విచారణకు బోర్డు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించారు.
రష్యాలో తయారైన మిగ్-29 కే విమానాల్లో కే-36D-3.5 ఎజెక్షన్ సీటుతో అమర్చబడింది.ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనదిగా పరిగణిస్తుంటారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎజెక్షన్ హ్యాండిల్ లాగడంతో వెనక సీటులో ఉండే పైలట్ ముందుకు ఎజెక్ట్ అయి సురక్షితంగా బయటపడేందుకు సాయపడటం ఈ ఎజెక్షన్ సీటు ప్రత్యేకత. 2020 ఫిబ్రవరి, నవంబర్ నెలల్లో రెండు మిగ్-29 కే విమానాలు కూలిపోయాయి.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట భక్తులకు గుడ్ న్యూస్
- హోటల్లో ఘోర అగ్నిప్రమాదం: ఏడుగురు భక్తులు సజీవదహనం
- నేటి నుంచి టిమ్స్లో పేదలకు పూర్తి ఉచిత సేవలు..
- ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 4.35 లక్షలకు పైగా కువైటీలు..!!
- ఫుజైరాలో 21 అక్రమ లాబ్ స్టర్ వలలు స్వాధీనం..!!
- ఖతార్లో స్మార్ట్ రవాణా వ్యవస్థల దిశగా కీలక అడుగు..!!
- చమురు కాలుష్యంపై ఒమన్ హెచ్చరిక..రాస్ మద్రకా తీరంలో 40 కిలోమీటర్లకు విస్తరణ..!!
- భోగాపురం ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండింగ్
- యువతను ఆకట్టుకుంటున్న ‘బహ్రైనన్నా’ ఇంటరాక్టివ్ కార్యక్రమాలు..!!
- అధిక ప్రమాద కార్యకలాపాలకు థర్డ్ పార్టీ బీమా.. సౌదీ అరేబియా కీలక నిర్ణయం..!!







