గోవాలో కుప్పకూలిన మిగ్-29కే యుద్ధ విమానం
- October 12, 2022
న్యూఢిల్లీ: గోవా తీరంలో ఓ మిగ్-29 కే యుద్ధ విమానం కుప్పకూలింది.ఈ ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు.సాంకేతిక లోపం కారణంగానే మిగ్-29 కే కూలిపోయినట్లు నేవీ అధికారులు భావిస్తున్నారు.కాగా, మిగ్-29 కే యుద్ధవిమానాలు 2019 లో ఇండియన్ నేవీలో చేరిన తర్వాత కూలిపోవడం ఇది నాలుగోసారి.విమానం సముద్రం మీదుగా ఎగురుతుండగా సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కూలిపోయింది. నేవీ అధికారులు వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం వలన పైలట్ సురక్షింతంగా బయటపడ్డాడు. శిక్షణలో వినియోగిస్తున్న ఈ విమానం నేవీ స్థావరానికి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై విచారణకు బోర్డు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించారు.
రష్యాలో తయారైన మిగ్-29 కే విమానాల్లో కే-36D-3.5 ఎజెక్షన్ సీటుతో అమర్చబడింది.ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనదిగా పరిగణిస్తుంటారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎజెక్షన్ హ్యాండిల్ లాగడంతో వెనక సీటులో ఉండే పైలట్ ముందుకు ఎజెక్ట్ అయి సురక్షితంగా బయటపడేందుకు సాయపడటం ఈ ఎజెక్షన్ సీటు ప్రత్యేకత. 2020 ఫిబ్రవరి, నవంబర్ నెలల్లో రెండు మిగ్-29 కే విమానాలు కూలిపోయాయి.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







