జీతాలివ్వలేదని 13 మంది ప్రవాసులు ఆత్మహత్య యత్నం
- October 12, 2022
కువైట్: కాంట్రాక్టు కంపెనీ తమ ఆర్థిక బకాయిలను తిరస్కరించినందుకు 13 మంది ప్రవాసులు సాల్మియాలోని భవనం పైనుంచి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. వారందరినీ అదుపులోకి తీసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. మొత్తం 13 మంది ప్రవాసులు ఒకే దేశానికి చెందిన వారని, కాంట్రాక్టు కంపెనీ కోసం కమర్షియల్ విజిట్ వీసాపై దేశంలోకి వచ్చినట్లు గుర్తించామన్నారు. వారి పెండింగ్ బకాయిలన్నింటినీ క్లియర్ చేసిన తర్వాత వారిని దేశం నుండి బహిష్కరించాలని, దేశంలోకి తిరిగి ప్రవేశించకుండా వారిని నిరోధించాలని ఆదేశాలు ఇచ్చినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. దీంతోపాటు వీరిని నియమించిన కంపెనీపై చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









