జీతాలివ్వలేదని 13 మంది ప్రవాసులు ఆత్మహత్య యత్నం
- October 12, 2022
కువైట్: కాంట్రాక్టు కంపెనీ తమ ఆర్థిక బకాయిలను తిరస్కరించినందుకు 13 మంది ప్రవాసులు సాల్మియాలోని భవనం పైనుంచి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. వారందరినీ అదుపులోకి తీసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. మొత్తం 13 మంది ప్రవాసులు ఒకే దేశానికి చెందిన వారని, కాంట్రాక్టు కంపెనీ కోసం కమర్షియల్ విజిట్ వీసాపై దేశంలోకి వచ్చినట్లు గుర్తించామన్నారు. వారి పెండింగ్ బకాయిలన్నింటినీ క్లియర్ చేసిన తర్వాత వారిని దేశం నుండి బహిష్కరించాలని, దేశంలోకి తిరిగి ప్రవేశించకుండా వారిని నిరోధించాలని ఆదేశాలు ఇచ్చినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. దీంతోపాటు వీరిని నియమించిన కంపెనీపై చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!







