101 కొత్త చారిత్రక ప్రదేశాలను గుర్తించిన సౌదీ హెరిటేజ్ కమిషన్
- October 13, 2022
రియాద్: 101 కొత్త పురావస్తు, చారిత్రక ప్రదేశాలను గుర్తించి జాతీయ పురాతన వస్తువుల రిజిస్టర్లో నమోదు చేసినట్లు కింగ్డమ్ హెరిటేజ్ కమిషన్ వెల్లడించింది. దీంతో రాజ్యవ్యాప్తంగా నమోదిత పురావస్తు ప్రదేశాల సంఖ్య 8,528కి చేరుకుందని తెలిపింది. కొత్తగా కనుగొన్న వాటిల్లో హేల్లో 81, తబుక్లో తొమ్మిది, మదీనాలో ఆరు, ఖాసిమ్లో మూడు, అసిర్ మరియు జౌఫ్లో ఒక్కో సైట్ ఉన్నాయని పేర్కొంది. జాతీయ పురాతన వస్తువుల రిజిస్టర్లో రాజ్యంలోని పురావస్తు, చారిత్రక ప్రదేశాలను కనుగొని, అధికారికంగా నమోదు చేసేందుకు కమిషన్ కృషి చేస్తోంది. చారిత్రక ప్రదేశాల పరిపాలన, రక్షణ, సంరక్షణను సులభతరం చేసేందుకు వీలుగా ఆయా ప్రాంతాలను డిజిటల్ మ్యాప్లలో పొందుపరుచుతుంది. ఇందు కోసం ఆర్కైవ్ పత్రాలు, ఫోటోలతో ప్రత్యేక డేటాబేస్ను ఏర్పాటు చేయనున్నారు. సౌదీ చారిత్రక వారసత్వాన్ని సంరక్షించడంలో పౌరులు కీలక భాగస్వాములుగా చేరాలని, బాలాగ్ ప్లాట్ఫారమ్ ద్వారా తమకు తెలిసిన/కనుగొన్న పురావస్తు ప్రదేశాలను తెలియజేయాలని సౌదీ హెరిటేజ్ కమిషన్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అమెరికాలో తూటాకు బలైన తెలంగాణ విద్యార్థి
- ఖతార్ లో యాంటీ-డోపింగ్ ఏజెన్సీ ఏర్పాటు..!!
- మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!
- కువైట్ లో 28వేల మంది పై బహిష్కరణ వేటు..!!
- గ్లోబర్ స్పేస్ ఇండస్ట్రీకి రీజినల్ హబ్ గా ఒమన్..!!
- ఏ వీసా ఉన్నా ఉమ్రా చేయవచ్చు: హజ్ మంత్రిత్వ శాఖ
- దుబాయ్లో ఇంజనీరింగ్ కన్సల్టెన్సీల కోసం కొత్త చట్టం..!!
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం
- By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్కు కాల్ చేయండి!
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..