బహ్రెయిన్లో వర్క్ పర్మిట్ల మోసాలు.. 20 మందిపై చర్యలు
- October 13, 2022
బహ్రెయిన్: ప్రవాస కార్మికులకు అవసరం లేకుండా వర్క్ పర్మిట్లను జారీ చేయడం, వర్క్ పర్మిట్ల జారీలో మోసాలు చేయడం వంటి కేసుల్లో 20 మంది నిందితులపై న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రకటించింది. ఈ కేసులో నిందితులకు BHD 441,000 జరిమానాలు విధించినట్లు పేర్కొంది. రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశాలను అమలు చేయడానికి అథారిటీ పూర్తి నిబద్ధత ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అథారిటీ తెలిపింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్, న్యాయవ్యవస్థతో పాటు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఎవిడెన్స్లోని సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీల సహకారంతో నిందితులపై విచారణ కొనసాగుతుందని LMRA వెల్లడించింది. కార్మిక మార్కెట్ సంస్థపై 2006 నాటి చట్టం నెం.(19)లోని నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన 441 కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సూచించినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







