బహ్రెయిన్లో వర్క్ పర్మిట్ల మోసాలు.. 20 మందిపై చర్యలు
- October 13, 2022
బహ్రెయిన్: ప్రవాస కార్మికులకు అవసరం లేకుండా వర్క్ పర్మిట్లను జారీ చేయడం, వర్క్ పర్మిట్ల జారీలో మోసాలు చేయడం వంటి కేసుల్లో 20 మంది నిందితులపై న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రకటించింది. ఈ కేసులో నిందితులకు BHD 441,000 జరిమానాలు విధించినట్లు పేర్కొంది. రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశాలను అమలు చేయడానికి అథారిటీ పూర్తి నిబద్ధత ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అథారిటీ తెలిపింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్, న్యాయవ్యవస్థతో పాటు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఎవిడెన్స్లోని సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీల సహకారంతో నిందితులపై విచారణ కొనసాగుతుందని LMRA వెల్లడించింది. కార్మిక మార్కెట్ సంస్థపై 2006 నాటి చట్టం నెం.(19)లోని నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన 441 కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సూచించినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- ఇరాన్తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!









