బహ్రెయిన్లో వర్క్ పర్మిట్ల మోసాలు.. 20 మందిపై చర్యలు
- October 13, 2022
బహ్రెయిన్: ప్రవాస కార్మికులకు అవసరం లేకుండా వర్క్ పర్మిట్లను జారీ చేయడం, వర్క్ పర్మిట్ల జారీలో మోసాలు చేయడం వంటి కేసుల్లో 20 మంది నిందితులపై న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రకటించింది. ఈ కేసులో నిందితులకు BHD 441,000 జరిమానాలు విధించినట్లు పేర్కొంది. రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశాలను అమలు చేయడానికి అథారిటీ పూర్తి నిబద్ధత ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అథారిటీ తెలిపింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్, న్యాయవ్యవస్థతో పాటు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఎవిడెన్స్లోని సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీల సహకారంతో నిందితులపై విచారణ కొనసాగుతుందని LMRA వెల్లడించింది. కార్మిక మార్కెట్ సంస్థపై 2006 నాటి చట్టం నెం.(19)లోని నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన 441 కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సూచించినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ లో యాంటీ-డోపింగ్ ఏజెన్సీ ఏర్పాటు..!!
- మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!
- కువైట్ లో 28వేల మంది పై బహిష్కరణ వేటు..!!
- గ్లోబర్ స్పేస్ ఇండస్ట్రీకి రీజినల్ హబ్ గా ఒమన్..!!
- ఏ వీసా ఉన్నా ఉమ్రా చేయవచ్చు: హజ్ మంత్రిత్వ శాఖ
- దుబాయ్లో ఇంజనీరింగ్ కన్సల్టెన్సీల కోసం కొత్త చట్టం..!!
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం
- By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్కు కాల్ చేయండి!
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..
- గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక