దుబాయ్ వెహికిల్ టెస్టింగ్ కేంద్రాల పనివేళల్లో మార్పులు
- October 13, 2022
యూఏఈ: తస్జీల్ హట్టా, జెబెల్ అలీ కేంద్రాలు మినహా ఎమిరేట్లోని 28 సర్వీస్ ప్రొవైడర్ సెంటర్లలో (వాహన సాంకేతిక పరీక్ష) ఒకే పనిగంటలను ప్రవేశపెట్టినట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. సర్వీస్ ప్రొవైడింగ్ సెంటర్లలో కొత్త పనివేళలు వినియోగదారులకు, వాహనదారులకు మెరుగైన సేవలను అందిస్తుందని అథారిటీ తెలిపింది. కొత్త పని వేళల 2022 అక్టోబర్ 14నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. తస్జీల్ హట్టా, జెబెల్ అలీ కేంద్రాలు మినహా RTA సర్వీస్ ప్రొవైడింగ్ సెంటర్లలో కొత్త పని వేళలు ఉదయం 7:00 నుండి రాత్రి 10:30 వరకు పొడిగించబడతాయి. తస్జీల్ హట్టా సెంటర్ ఉదయం 8:00 నుండి సాయంత్రం 4:00 వరకు పని చేస్తుంది. తస్జీల్ జెబెల్ అలీ సెంటర్ ఉదయం 7:00 నుండి సాయంత్రం 5:00 వరకు తెరిచి ఉంటాయని ఆర్టీఏ పేర్కొంది. శనివారం కాకుండా సర్వీస్ ప్రొవైడర్ సెంటర్లలో వారాంతపు సెలవు ఆదివారం ఉంటుంది. శుక్రవారం పని గంటలు రెండు షిఫ్ట్లుగా ఉంటాయి.. 28 సర్వీస్ ప్రొవైడర్ సెంటర్లలో ఉదయం షిఫ్టు ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, సాయంత్రం షిఫ్ట్ మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 10:30 వరకు ఉంటుందని అథారిటీ వెల్లడించింది. శుక్రవారం తస్జీల్ జెబెల్ అలీ సెంటర్ ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు మాత్రమే పనిచేస్తుందని, అయితే శుక్రవారం తస్జీల్ హట్టా సెంటర్లో పని వేళలు సాయంత్రం 3:00 నుండి రాత్రి 9.00 గంటల వరకు ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో యాంటీ-డోపింగ్ ఏజెన్సీ ఏర్పాటు..!!
- మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!
- కువైట్ లో 28వేల మందిపై బహిష్కరణ వేటు..!!
- గ్లోబర్ స్పేస్ ఇండస్ట్రీకి రీజినల్ హబ్ గా ఒమన్..!!
- ఏ వీసా ఉన్నా ఉమ్రా చేయవచ్చు: హజ్ మంత్రిత్వ శాఖ
- దుబాయ్లో ఇంజనీరింగ్ కన్సల్టెన్సీల కోసం కొత్త చట్టం..!!
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం
- By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్కు కాల్ చేయండి!
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..
- గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక