దుబాయ్ వెహికిల్ టెస్టింగ్ కేంద్రాల పనివేళల్లో మార్పులు
- October 13, 2022
యూఏఈ: తస్జీల్ హట్టా, జెబెల్ అలీ కేంద్రాలు మినహా ఎమిరేట్లోని 28 సర్వీస్ ప్రొవైడర్ సెంటర్లలో (వాహన సాంకేతిక పరీక్ష) ఒకే పనిగంటలను ప్రవేశపెట్టినట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. సర్వీస్ ప్రొవైడింగ్ సెంటర్లలో కొత్త పనివేళలు వినియోగదారులకు, వాహనదారులకు మెరుగైన సేవలను అందిస్తుందని అథారిటీ తెలిపింది. కొత్త పని వేళల 2022 అక్టోబర్ 14నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. తస్జీల్ హట్టా, జెబెల్ అలీ కేంద్రాలు మినహా RTA సర్వీస్ ప్రొవైడింగ్ సెంటర్లలో కొత్త పని వేళలు ఉదయం 7:00 నుండి రాత్రి 10:30 వరకు పొడిగించబడతాయి. తస్జీల్ హట్టా సెంటర్ ఉదయం 8:00 నుండి సాయంత్రం 4:00 వరకు పని చేస్తుంది. తస్జీల్ జెబెల్ అలీ సెంటర్ ఉదయం 7:00 నుండి సాయంత్రం 5:00 వరకు తెరిచి ఉంటాయని ఆర్టీఏ పేర్కొంది. శనివారం కాకుండా సర్వీస్ ప్రొవైడర్ సెంటర్లలో వారాంతపు సెలవు ఆదివారం ఉంటుంది. శుక్రవారం పని గంటలు రెండు షిఫ్ట్లుగా ఉంటాయి.. 28 సర్వీస్ ప్రొవైడర్ సెంటర్లలో ఉదయం షిఫ్టు ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, సాయంత్రం షిఫ్ట్ మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 10:30 వరకు ఉంటుందని అథారిటీ వెల్లడించింది. శుక్రవారం తస్జీల్ జెబెల్ అలీ సెంటర్ ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు మాత్రమే పనిచేస్తుందని, అయితే శుక్రవారం తస్జీల్ హట్టా సెంటర్లో పని వేళలు సాయంత్రం 3:00 నుండి రాత్రి 9.00 గంటల వరకు ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- ఇండోనేసియాలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!









