దుబాయ్ వెహికిల్ టెస్టింగ్ కేంద్రాల పనివేళల్లో మార్పులు
- October 13, 2022
యూఏఈ: తస్జీల్ హట్టా, జెబెల్ అలీ కేంద్రాలు మినహా ఎమిరేట్లోని 28 సర్వీస్ ప్రొవైడర్ సెంటర్లలో (వాహన సాంకేతిక పరీక్ష) ఒకే పనిగంటలను ప్రవేశపెట్టినట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. సర్వీస్ ప్రొవైడింగ్ సెంటర్లలో కొత్త పనివేళలు వినియోగదారులకు, వాహనదారులకు మెరుగైన సేవలను అందిస్తుందని అథారిటీ తెలిపింది. కొత్త పని వేళల 2022 అక్టోబర్ 14నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. తస్జీల్ హట్టా, జెబెల్ అలీ కేంద్రాలు మినహా RTA సర్వీస్ ప్రొవైడింగ్ సెంటర్లలో కొత్త పని వేళలు ఉదయం 7:00 నుండి రాత్రి 10:30 వరకు పొడిగించబడతాయి. తస్జీల్ హట్టా సెంటర్ ఉదయం 8:00 నుండి సాయంత్రం 4:00 వరకు పని చేస్తుంది. తస్జీల్ జెబెల్ అలీ సెంటర్ ఉదయం 7:00 నుండి సాయంత్రం 5:00 వరకు తెరిచి ఉంటాయని ఆర్టీఏ పేర్కొంది. శనివారం కాకుండా సర్వీస్ ప్రొవైడర్ సెంటర్లలో వారాంతపు సెలవు ఆదివారం ఉంటుంది. శుక్రవారం పని గంటలు రెండు షిఫ్ట్లుగా ఉంటాయి.. 28 సర్వీస్ ప్రొవైడర్ సెంటర్లలో ఉదయం షిఫ్టు ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, సాయంత్రం షిఫ్ట్ మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 10:30 వరకు ఉంటుందని అథారిటీ వెల్లడించింది. శుక్రవారం తస్జీల్ జెబెల్ అలీ సెంటర్ ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు మాత్రమే పనిచేస్తుందని, అయితే శుక్రవారం తస్జీల్ హట్టా సెంటర్లో పని వేళలు సాయంత్రం 3:00 నుండి రాత్రి 9.00 గంటల వరకు ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







