దుబాయ్ వెహికిల్ టెస్టింగ్ కేంద్రాల పనివేళల్లో మార్పులు
- October 13, 2022
యూఏఈ: తస్జీల్ హట్టా, జెబెల్ అలీ కేంద్రాలు మినహా ఎమిరేట్లోని 28 సర్వీస్ ప్రొవైడర్ సెంటర్లలో (వాహన సాంకేతిక పరీక్ష) ఒకే పనిగంటలను ప్రవేశపెట్టినట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. సర్వీస్ ప్రొవైడింగ్ సెంటర్లలో కొత్త పనివేళలు వినియోగదారులకు, వాహనదారులకు మెరుగైన సేవలను అందిస్తుందని అథారిటీ తెలిపింది. కొత్త పని వేళల 2022 అక్టోబర్ 14నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. తస్జీల్ హట్టా, జెబెల్ అలీ కేంద్రాలు మినహా RTA సర్వీస్ ప్రొవైడింగ్ సెంటర్లలో కొత్త పని వేళలు ఉదయం 7:00 నుండి రాత్రి 10:30 వరకు పొడిగించబడతాయి. తస్జీల్ హట్టా సెంటర్ ఉదయం 8:00 నుండి సాయంత్రం 4:00 వరకు పని చేస్తుంది. తస్జీల్ జెబెల్ అలీ సెంటర్ ఉదయం 7:00 నుండి సాయంత్రం 5:00 వరకు తెరిచి ఉంటాయని ఆర్టీఏ పేర్కొంది. శనివారం కాకుండా సర్వీస్ ప్రొవైడర్ సెంటర్లలో వారాంతపు సెలవు ఆదివారం ఉంటుంది. శుక్రవారం పని గంటలు రెండు షిఫ్ట్లుగా ఉంటాయి.. 28 సర్వీస్ ప్రొవైడర్ సెంటర్లలో ఉదయం షిఫ్టు ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, సాయంత్రం షిఫ్ట్ మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 10:30 వరకు ఉంటుందని అథారిటీ వెల్లడించింది. శుక్రవారం తస్జీల్ జెబెల్ అలీ సెంటర్ ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు మాత్రమే పనిచేస్తుందని, అయితే శుక్రవారం తస్జీల్ హట్టా సెంటర్లో పని వేళలు సాయంత్రం 3:00 నుండి రాత్రి 9.00 గంటల వరకు ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!









