అబుధాబిలో మద్యం తయారీ, విక్రయాలపై కొత్త నిబంధనలు
- October 14, 2022
అబుధాబి: మద్యం (ఆల్కహాలిక్ డ్రింక్స్) తయారీ, విక్రయాలపై కొత్త నిబంధనలను డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం - అబుధాబి (DCT) విడుదల చేసింది. వీటిని అమలు చేసేందుకు మద్యం తయారీ దారులు, రిటైల్ దుకాణాలు, పంపిణీ సంస్థలకు ఆరు నెలల సమయాన్ని అథారిటీ ఇచ్చింది. నిబంధనలు పాటించని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అథారిటీ హెచ్చరించింది. డీసీటీ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కనీస ఆల్కహాలిక్ స్ట్రెంత్ తప్పనిసరిగా 0.5 శాతం ఉండాలి. వైన్లో వెనిగర్ రుచి లేదా వాసన లేకుండా ఉండాలి. అయితే బీర్లో పంచదార పాకం మినహా ఎలాంటి కృత్రిమ స్వీటెనర్లు, రుచులు, రంగులు ఉండకూడదు. తగిన శానిటరీ పరిస్థితులకు అనుగుణంగా మద్యాన్ని తయారు చేయాలి. తయారైన మద్యాన్ని శుభ్రమైన కంటైనర్లలో ప్యాక్ చేయాలి. తయరీలో వినియోగించిన పదార్థాలు, ఆరిజిన్, తయారీదారు, షెల్ఫ్ లైఫ్, ఆల్కహాల్ శాతం ఇలా సమస్త సమాచారం తప్పనిసరిగా లేబుల్లపై పేర్కొనబడాలి. వీటితోపాటు ప్యాకేజింగ్, రవాణా, నిల్వ గురించిన అనేక నిబంధనలను డీసీటీ సూచించింది.
తాజా వార్తలు
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?









