అబుధాబిలో మద్యం తయారీ, విక్రయాలపై కొత్త నిబంధనలు
- October 14, 2022
అబుధాబి: మద్యం (ఆల్కహాలిక్ డ్రింక్స్) తయారీ, విక్రయాలపై కొత్త నిబంధనలను డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం - అబుధాబి (DCT) విడుదల చేసింది. వీటిని అమలు చేసేందుకు మద్యం తయారీ దారులు, రిటైల్ దుకాణాలు, పంపిణీ సంస్థలకు ఆరు నెలల సమయాన్ని అథారిటీ ఇచ్చింది. నిబంధనలు పాటించని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అథారిటీ హెచ్చరించింది. డీసీటీ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కనీస ఆల్కహాలిక్ స్ట్రెంత్ తప్పనిసరిగా 0.5 శాతం ఉండాలి. వైన్లో వెనిగర్ రుచి లేదా వాసన లేకుండా ఉండాలి. అయితే బీర్లో పంచదార పాకం మినహా ఎలాంటి కృత్రిమ స్వీటెనర్లు, రుచులు, రంగులు ఉండకూడదు. తగిన శానిటరీ పరిస్థితులకు అనుగుణంగా మద్యాన్ని తయారు చేయాలి. తయారైన మద్యాన్ని శుభ్రమైన కంటైనర్లలో ప్యాక్ చేయాలి. తయరీలో వినియోగించిన పదార్థాలు, ఆరిజిన్, తయారీదారు, షెల్ఫ్ లైఫ్, ఆల్కహాల్ శాతం ఇలా సమస్త సమాచారం తప్పనిసరిగా లేబుల్లపై పేర్కొనబడాలి. వీటితోపాటు ప్యాకేజింగ్, రవాణా, నిల్వ గురించిన అనేక నిబంధనలను డీసీటీ సూచించింది.
తాజా వార్తలు
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
- ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- కొత్త IT చట్టం రూల్స్
- బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!









