అబుధాబిలో మద్యం తయారీ, విక్రయాలపై కొత్త నిబంధనలు
- October 14, 2022
అబుధాబి: మద్యం (ఆల్కహాలిక్ డ్రింక్స్) తయారీ, విక్రయాలపై కొత్త నిబంధనలను డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం - అబుధాబి (DCT) విడుదల చేసింది. వీటిని అమలు చేసేందుకు మద్యం తయారీ దారులు, రిటైల్ దుకాణాలు, పంపిణీ సంస్థలకు ఆరు నెలల సమయాన్ని అథారిటీ ఇచ్చింది. నిబంధనలు పాటించని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అథారిటీ హెచ్చరించింది. డీసీటీ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కనీస ఆల్కహాలిక్ స్ట్రెంత్ తప్పనిసరిగా 0.5 శాతం ఉండాలి. వైన్లో వెనిగర్ రుచి లేదా వాసన లేకుండా ఉండాలి. అయితే బీర్లో పంచదార పాకం మినహా ఎలాంటి కృత్రిమ స్వీటెనర్లు, రుచులు, రంగులు ఉండకూడదు. తగిన శానిటరీ పరిస్థితులకు అనుగుణంగా మద్యాన్ని తయారు చేయాలి. తయారైన మద్యాన్ని శుభ్రమైన కంటైనర్లలో ప్యాక్ చేయాలి. తయరీలో వినియోగించిన పదార్థాలు, ఆరిజిన్, తయారీదారు, షెల్ఫ్ లైఫ్, ఆల్కహాల్ శాతం ఇలా సమస్త సమాచారం తప్పనిసరిగా లేబుల్లపై పేర్కొనబడాలి. వీటితోపాటు ప్యాకేజింగ్, రవాణా, నిల్వ గురించిన అనేక నిబంధనలను డీసీటీ సూచించింది.
తాజా వార్తలు
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!
- పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన మంత్రి లోకేశ్
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియెన్స్ సెంటర్ ప్రారంభం
- ఫ్రాన్స్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
- ప్రాంతీయ పరిస్థితుల కారణంగా చిక్కుకున్న ప్రయాణికులకు 30 రోజుల గడువు ప్రకటించిన యూఏఈ
- FTPC ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే జాతీయ పురస్కారాలు
- కువైట్ లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు..!!







