అబుధాబిలో మద్యం తయారీ, విక్రయాలపై కొత్త నిబంధనలు
- October 14, 2022
అబుధాబి: మద్యం (ఆల్కహాలిక్ డ్రింక్స్) తయారీ, విక్రయాలపై కొత్త నిబంధనలను డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం - అబుధాబి (DCT) విడుదల చేసింది. వీటిని అమలు చేసేందుకు మద్యం తయారీ దారులు, రిటైల్ దుకాణాలు, పంపిణీ సంస్థలకు ఆరు నెలల సమయాన్ని అథారిటీ ఇచ్చింది. నిబంధనలు పాటించని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అథారిటీ హెచ్చరించింది. డీసీటీ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కనీస ఆల్కహాలిక్ స్ట్రెంత్ తప్పనిసరిగా 0.5 శాతం ఉండాలి. వైన్లో వెనిగర్ రుచి లేదా వాసన లేకుండా ఉండాలి. అయితే బీర్లో పంచదార పాకం మినహా ఎలాంటి కృత్రిమ స్వీటెనర్లు, రుచులు, రంగులు ఉండకూడదు. తగిన శానిటరీ పరిస్థితులకు అనుగుణంగా మద్యాన్ని తయారు చేయాలి. తయారైన మద్యాన్ని శుభ్రమైన కంటైనర్లలో ప్యాక్ చేయాలి. తయరీలో వినియోగించిన పదార్థాలు, ఆరిజిన్, తయారీదారు, షెల్ఫ్ లైఫ్, ఆల్కహాల్ శాతం ఇలా సమస్త సమాచారం తప్పనిసరిగా లేబుల్లపై పేర్కొనబడాలి. వీటితోపాటు ప్యాకేజింగ్, రవాణా, నిల్వ గురించిన అనేక నిబంధనలను డీసీటీ సూచించింది.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







