రియాద్లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై హైటెక్ పర్యవేక్షణ
- October 14, 2022
రియాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలు, ఇతర నేరాలపై హైటెక్ పర్యవేక్షణను అమలు చేయడం ప్రారంభించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పథకం మొదటి దశ రియాద్ ప్రాంతంలో ప్రారంభించినట్లు తెలిపింది. ట్రాఫిక్, నేర ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు అధిక-ఖచ్చితమైన సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెట్రోలింగ్ బృందాలు రాడార్, 360-డిగ్రీ కెమెరాతో సహా అత్యంత అధునాతన సాంకేతిక పరికరాలను కలిగి ఉంటాయన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి వాటిని సులువుగా పసిగట్టే అవకాశం ఉందన్నారు. రియాద్ ప్రాంతంలో ప్రారంభ దశలో.. హైటెక్ పరికరాలను ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించే రెండు భద్రతా గస్తీలు తమ పనులను ప్రారంభించాయన్నారు. వాంటెడ్ లిస్ట్లో లేని వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ వాంటెడ్ పర్సన్స్ను సెక్యూరిటీ అధికారులు పట్టుకునేలా ఈ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!
- బహ్రెయిన్ లో ‘గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- చెన్నైలో భారీ పొగమంచు..దుబాయ్ ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు..!!
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు









