రియాద్లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై హైటెక్ పర్యవేక్షణ
- October 14, 2022
రియాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలు, ఇతర నేరాలపై హైటెక్ పర్యవేక్షణను అమలు చేయడం ప్రారంభించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పథకం మొదటి దశ రియాద్ ప్రాంతంలో ప్రారంభించినట్లు తెలిపింది. ట్రాఫిక్, నేర ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు అధిక-ఖచ్చితమైన సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెట్రోలింగ్ బృందాలు రాడార్, 360-డిగ్రీ కెమెరాతో సహా అత్యంత అధునాతన సాంకేతిక పరికరాలను కలిగి ఉంటాయన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి వాటిని సులువుగా పసిగట్టే అవకాశం ఉందన్నారు. రియాద్ ప్రాంతంలో ప్రారంభ దశలో.. హైటెక్ పరికరాలను ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించే రెండు భద్రతా గస్తీలు తమ పనులను ప్రారంభించాయన్నారు. వాంటెడ్ లిస్ట్లో లేని వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ వాంటెడ్ పర్సన్స్ను సెక్యూరిటీ అధికారులు పట్టుకునేలా ఈ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







