రియాద్లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై హైటెక్ పర్యవేక్షణ
- October 14, 2022
రియాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలు, ఇతర నేరాలపై హైటెక్ పర్యవేక్షణను అమలు చేయడం ప్రారంభించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పథకం మొదటి దశ రియాద్ ప్రాంతంలో ప్రారంభించినట్లు తెలిపింది. ట్రాఫిక్, నేర ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు అధిక-ఖచ్చితమైన సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెట్రోలింగ్ బృందాలు రాడార్, 360-డిగ్రీ కెమెరాతో సహా అత్యంత అధునాతన సాంకేతిక పరికరాలను కలిగి ఉంటాయన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి వాటిని సులువుగా పసిగట్టే అవకాశం ఉందన్నారు. రియాద్ ప్రాంతంలో ప్రారంభ దశలో.. హైటెక్ పరికరాలను ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించే రెండు భద్రతా గస్తీలు తమ పనులను ప్రారంభించాయన్నారు. వాంటెడ్ లిస్ట్లో లేని వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ వాంటెడ్ పర్సన్స్ను సెక్యూరిటీ అధికారులు పట్టుకునేలా ఈ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









