ఖతార్ హయ్యా కార్డులు కలిగిన ముస్లింలను ఉమ్రాకు అనుమతించిన సౌదీ
- October 15, 2022
ఖతార్: ఫిఫా ప్రపంచ కప్ 2022 కోసం వచ్చే ఫుట్ బాల్ అభిమానులు మల్టీ-ఎంట్రీ వీసాతో ఉమ్రా చేయడానికి సౌదీ అరేబియా అనుమతించింది. ఖతార్ హయ్యా కార్డులు కలిగిన ముస్లింలు ఉమ్రా చేయవచ్చని, నవంబర్ 11 నుండి డిసెంబర్ 18, 2022 వరకు ఉచిత సౌదీ వీసాతో మదీనాను సందర్శించవచ్చని సౌదీ అరేబియా ప్రకటించింది. అలాగే ముస్లిం హయా కార్డ్ హోల్డర్లు రెండు నెలల వరకు దేశంలో ఉండవచ్చని విదేశాంగ మంత్రిత్వ శాఖలోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ వీసా అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఖలీద్ అల్-షమ్మరి తెలిపారు. వీసా ఉచితమని, కానీ వైద్య బీమా తప్పనిసరిగా వీసా ప్లాట్ఫారమ్ నుండి పొందాలని అల్-షమ్మరి సూచించారు. కార్డ్ హోల్డర్లకు మల్టీ-ఎంట్రీ వీసా అందిస్తున్నామని, దాని చెల్లుబాటు వ్యవధిలో వారు ఎప్పుడైనా సౌదీ అరేబియాలోకి ప్రవేశించవచ్చని, నిష్క్రమించవచ్చని అల్-షమ్మరి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









