ఖతార్ హయ్యా కార్డులు కలిగిన ముస్లింలను ఉమ్రాకు అనుమతించిన సౌదీ
- October 15, 2022ఖతార్: ఫిఫా ప్రపంచ కప్ 2022 కోసం వచ్చే ఫుట్ బాల్ అభిమానులు మల్టీ-ఎంట్రీ వీసాతో ఉమ్రా చేయడానికి సౌదీ అరేబియా అనుమతించింది. ఖతార్ హయ్యా కార్డులు కలిగిన ముస్లింలు ఉమ్రా చేయవచ్చని, నవంబర్ 11 నుండి డిసెంబర్ 18, 2022 వరకు ఉచిత సౌదీ వీసాతో మదీనాను సందర్శించవచ్చని సౌదీ అరేబియా ప్రకటించింది. అలాగే ముస్లిం హయా కార్డ్ హోల్డర్లు రెండు నెలల వరకు దేశంలో ఉండవచ్చని విదేశాంగ మంత్రిత్వ శాఖలోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ వీసా అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఖలీద్ అల్-షమ్మరి తెలిపారు. వీసా ఉచితమని, కానీ వైద్య బీమా తప్పనిసరిగా వీసా ప్లాట్ఫారమ్ నుండి పొందాలని అల్-షమ్మరి సూచించారు. కార్డ్ హోల్డర్లకు మల్టీ-ఎంట్రీ వీసా అందిస్తున్నామని, దాని చెల్లుబాటు వ్యవధిలో వారు ఎప్పుడైనా సౌదీ అరేబియాలోకి ప్రవేశించవచ్చని, నిష్క్రమించవచ్చని అల్-షమ్మరి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్