కౌలాలంపూర్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు
- October 15, 2022
కౌలలంపూర్: మలేషియాతో భారతదేశ ద్వైపాక్షిక భాగస్వామ్యానికి రక్షణ, భద్రత, విద్యా రంగాల్లో సహకారంతో పాటు బలమైన ఆర్థిక, వాణిజ్య సంబంధాలే మూల స్తంభంగా నిలిచాయని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.కౌలలంపూర్ లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత హై కమిషనర్ ఏర్పాటు చేసిన మర్యాద పూర్వక విందు కార్యక్రమంలో వారికి వివిధ రంగాలకు చెందిన మలేషియాలోని భారతీయ ప్రముఖులు స్వాగతం పలికారు. భారత హైకమిషనర్ బి.ఎన్. రెడ్డి, మానవవనరుల శాఖ మంత్రి ఎం.శర్వణన్, పర్యాటక, సాంస్కృతిక శాఖల సహాయ మంత్రి డా.సంథర జె.పి సహా పలువురు ప్రముఖులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
బలమైన ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలకు మూలంగా నిలుస్తాయన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రపంచం భారతదేశాన్ని ఆర్థిక వృద్ధికి శక్తివంతమైన ఇంజన్ గా చూస్తోందని పేర్కొన్నారు. ఎన్నారైలను భారతదేశ అత్యుత్తమ సాంస్కృతిక రాయబారులుగా అభివర్ణించిన ఆయన, భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







