కౌలాలంపూర్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు
- October 15, 2022
కౌలలంపూర్: మలేషియాతో భారతదేశ ద్వైపాక్షిక భాగస్వామ్యానికి రక్షణ, భద్రత, విద్యా రంగాల్లో సహకారంతో పాటు బలమైన ఆర్థిక, వాణిజ్య సంబంధాలే మూల స్తంభంగా నిలిచాయని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.కౌలలంపూర్ లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత హై కమిషనర్ ఏర్పాటు చేసిన మర్యాద పూర్వక విందు కార్యక్రమంలో వారికి వివిధ రంగాలకు చెందిన మలేషియాలోని భారతీయ ప్రముఖులు స్వాగతం పలికారు. భారత హైకమిషనర్ బి.ఎన్. రెడ్డి, మానవవనరుల శాఖ మంత్రి ఎం.శర్వణన్, పర్యాటక, సాంస్కృతిక శాఖల సహాయ మంత్రి డా.సంథర జె.పి సహా పలువురు ప్రముఖులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
బలమైన ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలకు మూలంగా నిలుస్తాయన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రపంచం భారతదేశాన్ని ఆర్థిక వృద్ధికి శక్తివంతమైన ఇంజన్ గా చూస్తోందని పేర్కొన్నారు. ఎన్నారైలను భారతదేశ అత్యుత్తమ సాంస్కృతిక రాయబారులుగా అభివర్ణించిన ఆయన, భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

తాజా వార్తలు
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి
- NRI టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- మహిళను హత్య చేసి ఫ్రిజ్లో భద్రపరిచిన వ్యక్తి లొంగుబాటు
- తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు..22 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- మయామి ఓపెన్ విజేతగా జానిక్ సినర్
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన EV సంస్థలు
- తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
- యూఏఈ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మరింత బలంగా ఆవిర్భవిస్తుంది: షేక్ మహమ్మద్
- దమ్మామ్, జుబైల్ పోర్టులలో ఫీజు మినహాయింపు పొడిగింపు..!!
- ప్రాంతీయ భద్రత, సముద్ర ముప్పులపై అరబ్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!









