‘డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్’ హోస్టింగ్ బిడ్ గెలిచిన ఖతార్
- October 18, 2022
దోహా: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లగ్జరీ వెడ్డింగ్ ప్లానింగ్ నిపుణులు హాజరయ్యే ‘డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లానర్స్ (DWP) కాంగ్రెస్’కు ఖతార్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు నిర్వాహణకు సంబంధించిన బిడ్ను ఖతార్ గెలుచుకుంది. 2023 మార్చి 14 -16 మధ్య జరిగే ఈ ప్రీమియర్ బిజినెస్-టు-బిజినెస్ గ్లోబల్ ఈవెంట్లో ప్రపంచ దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు, 140 మంది లగ్జరీ వెడ్డింగ్ ప్లానింగ్ నిపుణులు పాల్గొంటారు. బిడ్ కు సంబంధించిన ఒప్పందంపై ఖతార్ టూరిజం చైర్మన్, ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ HE అక్బర్ అల్ బేకర్, క్యూఎన్ఏ (QNA) ఇంటర్నేషనల్ డైరెక్టర్ అకాష్ జైన్ అక్టోబర్ 17న ఎగ్జిక్యూటివ్ల బృందంతో కలిసి భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశారు. ఈ సందర్భంగా హెచ్ఈ అక్బర్ అల్ బేకర్ మాట్లాడుతూ.. వెడ్డింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా డెస్టినేషన్ వెడ్డింగ్లు పెరుగుతున్నాయని, ప్రత్యేకమైన - విలాసవంతమైన వివాహ అనుభవాన్ని పొందాలనుకునే జంటలకు ఖతార్ ఒక ఆప్షన్ గా మారుతుందని తెలిపారు. ఇంతకుముందు మారిషస్, ఫ్లోరెన్స్, థాయిలాండ్, మెక్సికో, బాలి తదితర ప్రాంతాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లానర్స్ (DWP) కాంగ్రెస్ ను నిర్వహించారు.
తాజా వార్తలు
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్









