బిగ్ టికెట్ డ్రాలో కేజీ బంగారం గెలుచుకున్న భారతీయ ఇంజినీర్
- October 18, 2022
అబుధాబి: ప్రవాస భారతీయు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జయకుమార్ తిరునావుకరసు అక్టోబర్ నెలలో నిర్వహించిన బిగ్ టికెట్ రెండవ వారపు ఇ-డ్రాలో విజేతగా నిలిచి కిలో 24 క్యారెట్ల బంగారం గెలుచుకున్నాడు. అక్టోబర్ 16న డ్రా తేదీకి ఒక రోజు ముందు టిక్కెట్ కొనుగోలు చేసినట్లు జయకుమార్ తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా అబుధాబిలో నివసిస్తున్నానని, 2019 నుండి బిగ్ టిక్కెట్ రాఫిల్ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నట్లు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేర్కొన్నారు. మరోవైపు నవంబర్ 3న 25 మిలియన్ దిర్హామ్ల గ్రాండ్ ప్రైజ్కు సంబంధించిన డ్రా ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. బిగ్ టికెట్ అభిమానులు టిక్కెట్లను ఆన్లైన్లో అక్టోబర్ 31 వరకు కొనుగోలు చేయొచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం







