ఖతార్లో అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్ డిపో ప్రారంభం
- October 19, 2022
దోహా: 478 బస్సుల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్ డిపోగా భావిస్తొన్న లుసైల్ బస్ డిపోను రవాణా మంత్రి హెచ్ఈ జస్సిమ్ సైఫ్ అహ్మద్ అల్-సులైతి ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్(MOT) పబ్లిక్ బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్లో భాగమైన ఈ డిపో.. లుసైల్ సిటీకి పశ్చిమాన ఉంది. పర్యావరణ మంత్రి HE షేక్ డాక్టర్. ఫలేహ్ బిన్ నాసర్ బిన్ అహ్మద్ బిన్ అలీ అల్ థానీ, పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) అధ్యక్షుడు డా. ఇంజి. సాద్ బిన్ అహ్మద్ అల్ ముహన్నది, ఖతార్ రవాణా పరిశ్రమ, డెలివరీ అండ్ లెగసీ కోసం సుప్రీం కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అల్-సులైతి మాట్లాడుతూ.. ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్ డిపో అయిన లుసైల్ బస్ డిపో, దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రజా రవాణా నెట్వర్క్ను అందిస్తుందన్నారు. ఈ బస్ డిపో మిడిల్ ఈస్ట్లో సౌరశక్తిపై ఆధారపడిన మొదటిదని, దీని వినియోగానికి అవసరమైన 4 మెగావాట్ల శక్తి(ప్రతిరోజు)ని ఉత్పత్తి చేయడానికి 11,000 PV సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ డిపో FIFA టోర్నమెంట్లో లుసైల్ స్టేడియం నుండి అల్లోని అల్ బైట్ స్టేడియం వరకు అభిమానుల రవాణాకు తోడ్పడుతుందన్నారు.
తాజా వార్తలు
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!







