కువైట్ లో 24 గంటల్లో ఇద్దరు మహిళలు అనుమానాస్పద మృతి
- October 19, 2022
కువైట్: మహ్బౌలాలో 24 గంటల్లో ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా మరణించారు. కువైట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక సిరియన్ మహిళ తన ఉంటున్న ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఆరవ అంతస్తు నుండి కింద పడి మరణించింది. మరో ఘటనలో ఓ నేపాల్ మహిళ తను ఉంటున్న బిల్డింగ్ లోని ఏడవ అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రెండు కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పోలీసుల తెలిపారు. కాగా, సిరియన్ మహిళ కిటికీని శుభ్రం చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయిందని ఆమె తండ్రి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఆత్మహత్య చేసుకున్న నేపాల్ మహిళ.. మరొక మహిళ, ఒక వ్యక్తితో కలిసి గదిని పంచుకుంటోందని, తెలియని కారణాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







