కువైట్ లో 24 గంటల్లో ఇద్దరు మహిళలు అనుమానాస్పద మృతి
- October 19, 2022
కువైట్: మహ్బౌలాలో 24 గంటల్లో ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా మరణించారు. కువైట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక సిరియన్ మహిళ తన ఉంటున్న ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఆరవ అంతస్తు నుండి కింద పడి మరణించింది. మరో ఘటనలో ఓ నేపాల్ మహిళ తను ఉంటున్న బిల్డింగ్ లోని ఏడవ అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రెండు కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పోలీసుల తెలిపారు. కాగా, సిరియన్ మహిళ కిటికీని శుభ్రం చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయిందని ఆమె తండ్రి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఆత్మహత్య చేసుకున్న నేపాల్ మహిళ.. మరొక మహిళ, ఒక వ్యక్తితో కలిసి గదిని పంచుకుంటోందని, తెలియని కారణాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







