‘షార్జా సెన్సస్ 2022’ మొదటి దశ ప్రారంభం
- October 20, 2022
యూఏఈ: మొదటి దశ షార్జా సెన్సస్ 2022ను ప్రారంభించినట్లు షార్జాలోని స్టాటిస్టిక్స్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (DSCD) వెల్లడించింది. మొదటి దశ సెన్సస్ నవంబర్ 20న ముగియనుంది. 300 మంది శిక్షణ పొందిన ఫీల్డ్ DSCD ఎన్యుమరేటర్లు.. అన్ని గృహాలను సందర్శించి కుటుంబాలు, వ్యక్తుల నుండి వ్యక్తిగతంగా ప్రాథమిక డేటాను సేకరించనున్నారు. దీంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు, వృత్తి, భాష, చదువు, భవనాల వివరాలను సేకరిస్తారు. ఫీల్డ్ సెన్సస్ బృందాలకు సహకరించాలని ఎమిరేట్లోని జాతీయులు, నివాసితులకు DSCD కోరింది. షార్జాలో 180 జాతీయతలకు చెందిన ప్రవాసులు నివసిస్తున్నారని, వారందరి వివరాలను సేకరించనున్నట్లు DSCD స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ కదీద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







