‘షార్జా సెన్సస్ 2022’ మొదటి దశ ప్రారంభం
- October 20, 2022
యూఏఈ: మొదటి దశ షార్జా సెన్సస్ 2022ను ప్రారంభించినట్లు షార్జాలోని స్టాటిస్టిక్స్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (DSCD) వెల్లడించింది. మొదటి దశ సెన్సస్ నవంబర్ 20న ముగియనుంది. 300 మంది శిక్షణ పొందిన ఫీల్డ్ DSCD ఎన్యుమరేటర్లు.. అన్ని గృహాలను సందర్శించి కుటుంబాలు, వ్యక్తుల నుండి వ్యక్తిగతంగా ప్రాథమిక డేటాను సేకరించనున్నారు. దీంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు, వృత్తి, భాష, చదువు, భవనాల వివరాలను సేకరిస్తారు. ఫీల్డ్ సెన్సస్ బృందాలకు సహకరించాలని ఎమిరేట్లోని జాతీయులు, నివాసితులకు DSCD కోరింది. షార్జాలో 180 జాతీయతలకు చెందిన ప్రవాసులు నివసిస్తున్నారని, వారందరి వివరాలను సేకరించనున్నట్లు DSCD స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ కదీద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







