పాఠశాల విద్యార్థులలో 12% పెరిగిన ఊబకాయం
- October 21, 2022
మస్కట్ : పాఠశాల విద్యార్థులలో ఊబకాయాన్ని అరికట్టడానికి 'ఐడియల్ వెయిట్ ఛాలెంజ్' అనే కార్యక్రమాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహకారంతో విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. మస్కట్ గవర్నరేట్లోని 12 పాఠశాలల్లో 200 మంది విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని పైలట్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH)లోని పబ్లిక్ హెల్త్ సీనియర్ స్పెషలిస్ట్, 'ఐడియల్ వెయిట్ ఛాలెంజ్' టెక్నికల్ టీమ్ హెడ్ డాక్టర్ సులైమాన్ అల్ షెరైఖీ తెలియజేశారు. నాలుగేళ్లలో ఈ పథకాన్ని సుల్లానేట్ లోని అన్ని పాఠశాలలకు విస్తరిస్తామన్నారు. ప్రోగ్రామ్లో భాగంగా సమతుల్య పోషణ, శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన జీవనశైలి, తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన జీవనం, మానసిక కోణాన్ని మెరుగుపరచడం లాంటి అంశాలపై విద్యార్థులకు వారి పేరెంట్స్ కు అవగాహన కల్పించునున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో ఊబకాయం కేసులను నిర్ధారించడం, పాఠశాల విద్యార్థులలో ఊబకాయాన్ని తగ్గించడం, ఊబకాయ సంబంధిత ఆరోగ్య పరిస్థితులు- ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం, పాఠశాల విద్యార్థులలో మధుమేహం, రక్తహీనత గుర్తించడానికి ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. తాజా అధికారిక గణాంకాల ప్రకారం.. ఐదు నుండి తొమ్మిది సంవత్సరాల వయస్సు గల విద్యార్థులలో ఊబకాయం పెరుగుదల అధికంగా ఉందన్నారు. ఇది అబ్బాయిలలో 15 శాతం, బాలికలలో 12 శాతంగా ఉందని చెప్పారు. జన్యు వారసత్వం వలన వచ్చే ఊబకాయాన్ని నియంత్రింయడం కష్టమే అయినా.. శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి, అతిగా తినడం, ప్రాథమిక పోషకాహార జ్ఞానం లేకపోవడం వంటి కారణంగా వచ్చే ఊబకాయాన్ని మాత్రం నియంత్రివచ్చని డాక్టర్ అల్ షెరైఖీ తెలిపారు. ఊబకాయం అలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మధుమేహం, అధిక రక్తపోటు, అసాధారణ రక్త కొవ్వు (డైస్లిపిడెమియా), ఆస్టియో ఆర్థరైటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ఫలితాలు నమోదు చేసే మొదటి పది పాఠశాలలకు, అలాగే బరువు తగ్గడంలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామన్నారు. 2017 నేషనల్ నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్ సర్వే ప్రకారం.. ఒమన్లోని జనాభాలో 66 శాతం మంది అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారని తెలిపారు. సుల్తానేట్లో ఊబకాయం ప్రాబల్యం పురుషులలో 23.2 శాతం, మహిళల్లో 39.3 శాతానికి పెరిగిందని డాక్టర్ అల్ షెరైఖీ వివరించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







