2 మిలియన్లకు పైగా ఉమ్రా వీసాలు జారీ
- October 21, 2022
రియాద్ : మొహర్రం 1, 1444 (జూలై 30, 2022)న ప్రారంభమైన ప్రస్తుత ఉమ్రా సీజన్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 176 దేశాల వారికి రెండు మిలియన్లకు పైగా వీసాలు జారీ చేశారు. అత్యధిక సంఖ్యలో ఉమ్రా యాత్రికులను పంపిన దేశాల్లో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా అగ్రస్థానంలో ఉందని హజ్, ఉమ్రా, విజిట్ జాతీయ కమిటీ సభ్యుడు హనీ అల్-ఒమైరి తెలిపారు. ఇండోనేషియా తర్వాత ఇరాక్, టర్కీ, పాకిస్థాన్, మలేషియా, ఇండియా, అజర్బైజాన్ ఉన్నాయన్నారు. రానున్న కాలంలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఉమ్రా యాత్రికుల రద్దీ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ ప్రస్తుత సంవత్సరం 1444 మొదటి త్రైమాసికంలో గ్రాండ్ మస్జీదును సందర్శించిన దేశీయ, విదేశీ ఉమ్రా యాత్రికుల సంఖ్య 30 మిలియన్లకు పైగా చేరుకుందని ప్రకటించింది. ఈ కాలంలో ప్రవక్త మస్జీదును సందర్శించి ప్రార్థనలు చేసిన వారు 40 మిలియన్లకు పైగా ఉన్నారని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







