250 ఎలక్ట్రానిక్ హుక్కా సెట్లు స్వాధీనం
- October 21, 2022
మస్కట్ : సౌత్ బటిన్హా గవర్నరేట్లోని అనధికార వస్తువుల వ్యాపారులపై కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) దాడులు చేసి ఎలక్ట్రానిక్ హుక్కాలను స్వాధీనం చేసుకుంది. అనధికారిక వర్తకం వస్తువుల నిరోధంలో భాగంగా బర్కాలోని విలాయత్లోని వినియోగదారుల రక్షణ విభాగం సిగరెట్లు, పొగాకు విక్రయాలకు సంబంధించిన సంస్థలో దాడులు చేసి 250 ఎలక్ట్రానిక్ హుక్కా సెట్లను స్వాధీనం చేసుకుందని సీపీఏ తెలిపింది. ఇలాంటి అనధికార వస్తువుల విక్రయాల గురించిన సమాచారం ఉంటే తమకు తెలపాలని సీపీఏ కోరింది. వినియోగదారుల రక్షణ చట్టాలు, నిబంధనలకు లోబడి ఉండాలని సరఫరాదారులను సీపీఏ హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం







