250 ఎలక్ట్రానిక్ హుక్కా సెట్లు స్వాధీనం
- October 21, 2022
మస్కట్ : సౌత్ బటిన్హా గవర్నరేట్లోని అనధికార వస్తువుల వ్యాపారులపై కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) దాడులు చేసి ఎలక్ట్రానిక్ హుక్కాలను స్వాధీనం చేసుకుంది. అనధికారిక వర్తకం వస్తువుల నిరోధంలో భాగంగా బర్కాలోని విలాయత్లోని వినియోగదారుల రక్షణ విభాగం సిగరెట్లు, పొగాకు విక్రయాలకు సంబంధించిన సంస్థలో దాడులు చేసి 250 ఎలక్ట్రానిక్ హుక్కా సెట్లను స్వాధీనం చేసుకుందని సీపీఏ తెలిపింది. ఇలాంటి అనధికార వస్తువుల విక్రయాల గురించిన సమాచారం ఉంటే తమకు తెలపాలని సీపీఏ కోరింది. వినియోగదారుల రక్షణ చట్టాలు, నిబంధనలకు లోబడి ఉండాలని సరఫరాదారులను సీపీఏ హెచ్చరించింది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









